70 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి సిద్ధం

హైదరాబాద్‌, ఆగస్టు 17
హైదరాబాద్‌ లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం, పంపిణీపై మంత్రి కేటీఆర్‌ ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. వారం రోజుల్లో తొలివిడత ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు.: జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రగతి భవన్‌ లో ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియను జీహెచ్‌ఎంసీ మరింత వేగవంతం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి , డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఇప్పటికే 70 వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్‌ పక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని, వాటిని వేగంగా పూర్తి చేస్తుందని, ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో సుమారు 4500కు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించామని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సుమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో లబ్దిదారులకు అందిస్తామని తెలిపారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ప్రక్రియ పంపిణీ పై మంత్రులు పలు సూచనలు చేశారు.డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని మంత్రులు తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి అర్హులను గుర్తిస్తుందని మంత్రులు తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వారికి కేటాయించే ఇండ్ల వద్దనే పంపిణీ కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRలీలీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *