గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం? ముగ్గురు మృతి
గద్వాలజిల్లా మండలము గోనుపాడు గ్రామ సవిూపంలో శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. దాంతో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అర్జున్ (22), వైశాలి (18), జమ్ములు (45) ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు. మృతదేహాలను గద్వాల ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ కు గల కారణాలు తెలియవలసి ఉంది…