ధరణిపై చెరొకదారి

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే లాభపడిరదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్‌ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహా జన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నాగర్‌ కర్నూల్‌లో నిర్వహించిన ‘నవ సంకల్ప సభ’లో నడ్డా పాల్గొన్నారు. అక్కడి సభలో మాట్లాడిన నడ్డా.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌, కుమార్తె కవిత మాత్రమే హ్యాపీగా ఉన్నారన్నారు. ఎందరో ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పాటైన రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిరదని మండిపడ్డారు.’’తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. కానీ కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారు. తెలంగాణ వికాసం కోసం మోడీ ఎంతో కృషి చేశారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం రూ.4,400 కోట్లు మంజూరు చేసింది. మెగా టెక్స్‌టైల్స్‌ పార్కును కేటాయించాం. సికింద్రాబాద్‌`తిరుపతి మధ్య వందేభారత్‌ను ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ, రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ కారిడారర్లు ఏర్పాటు చేశాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. మోడీ నేతృత్వంలో భారత్‌ 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది.మోడీ చేపట్టిన సంస్కరణలతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దేశంలో పేదరికం 10 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. ఉజ్వల, ఉజాలా పథకాలతో గ్యాస్‌ అందిస్తున్నాం. ఆయుస్మాన్‌ పథకంతో ఎంతోమందికి బీమా కల్పించాం. కరోనా, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి సంక్షోభం తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా మన దేశ ఆర్థిక వ్యవస్థే వేగంగా దూసుకెళ్లింది. భారత ప్రధాని మోడీని ది బాస్‌ అని వేరే దేశాధినేతలే కొనియాడుతున్నారు. అందరూ మోడీని హీరో.. గ్లోబల్‌ లీడర్‌ అంటుంటే.. కాంగ్రెస్‌ నేతలకు కడుపు మండుతుంది. ‘‘ అని జేపీ నడ్డా వ్యాఖ్యనించారు.టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన ఈ పార్టీ అసలు పేరు ‘భ్రష్టాచార్‌ రాక్షసుల సమితి’ అని నడ్డా ఆక్షేపించారు. రైతులను పీడిరచి తమ జేబులను నింపుకోవడానికే ధరణి పోర్టల్‌ ఉందని అన్నారు. ధరణితో భారీ అవినీతికి పాల్పడుతున్నారని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామని నడ్డా సంచలన ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పోర్టల్‌ కూడా బంద్‌ అవుతుందని వ్యాఖ్యనించారు. ధరణి పోర్టల్‌పై తాజాగా జేపీ నడ్డా చేసిన కామెంట్స్‌ తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతున్నాయి.కొద్ది రోజుల క్రితం ధరణి పోర్టల్‌పై మట్లాడిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అది మంచి స్కీమ్‌ అని అన్నారు. కాకపోతే అందులో కొన్ని సమస్యలు ఉన్నాయిని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు తొలగించి ధరణిని కొనసాగిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగానే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తామని తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటిచంటం ఆసక్తిరేపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగిస్తామని చెబుతుంటే.. జాతీయ అధ్యక్షుడు రద్దు చేస్తామని ప్రకటించారు. ఇలా నేతలు ధరణి పోర్టల్‌పై తలో మాట మట్లాడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జేపీ నడ్డా కామెంట్లపై బండి సంజయ్‌ తదుపరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *