జగన్‌ తో అనిల్‌ భేటీ

విజయవాడ, జూన్‌ 27 :
కొంతకాలం పార్టీకి దూరంగా ఉండి? ఇటీవలే మళ్లీ ఆక్టివ్‌ అయిన మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సీఎం జగన్‌ను కలిశారు. ఇటీవల ఆనం రామనారాయణరెడ్డితో అనిత్‌ కుమార్‌కు మాటల యుద్ధం జరుగుతుండడం, టీడీపీ నేత నారా లోకేశ్‌ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుండడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ ఈ సమావేశం జరిగింది. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితులపై జగన్‌ చర్చించారు. నెల్లూరు సిటీ పార్టీలో విభేదాలు తలెత్తడం వంటి అంశాలపై జగన్‌కు అనిల్‌ వివరించారు.అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు నెల్లూరు సిటీలో రాజకీయం కలిసిరావడం లేదు. సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత కనిపిస్తుంది. నెల్లూరు సిటీ నుంచి ఈ సారి అనిల్‌కు సీటు లేదంటూ ఐటీవల బాగా ప్రచారం జరిగింది. ఇక అనిల్‌ని టార్గెట్‌ చేసుకుని నారా లోకేష్‌, ఆనం రామ్‌ నారాయణ రెడ్డి..ఇతర టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఫైర్‌ అవుతున్నారు. వాటికి అనిల్‌ ఒక్కరే కౌంటర్‌ ఇచ్చుకుంటున్నారు. ఇక సొంత బాబాయ్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌తో ఉన్న విభేదాలు కాస్తా పార్టీలో ఇబ్బందిగా మారాయి. దీంతో ఇరువురు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న అనిల్‌ కుమార్‌ నాలుగు రోజుల క్రితమే మౌనం వీడి విూడియా ముందుకు వచ్చారు. జిల్లా రాజకీయాల్లో తాను ఎదుర్కొంటోన్న ఇబ్బందులన్నింటినీ అనిల్‌కు కుమార్‌.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తనను ఇబ్బంది పెడుతున్న నాయకుల వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు సమాచారం.అనిల్‌తో జిల్లా రాజకీయాలపై చర్చించిన జగన్‌? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పటిష్టంగా ఉందని.. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించినట్లు సమాచారం. ఇక తన నియోజకవర్గంలో పెండిరగ్‌లో ఉన్న పలు డెవలప్‌మెంట్‌ పనులకు నిధులు ఇవ్వాల్సిందిగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కోరారు. ఎమ్మెల్యే రిక్వెస్టులపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. నిధుల మంజూరు చేయాలని వెంటనే అధికారును ఆదేశించారట. ఈ భేటీతో కొంతకాలంగా నెలకొన్న విభేదాలు, అనుమానాలకు ఫుల్‌ స్టాప్‌ పడినట్లే అంటున్నారు పార్టీ నేతలు.
ఇక పాత అనిల్‌… చాలా రోజులుగా సైలెంట్‌ గా ఉన్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌… మళ్లీ విూడియా ముందుకు వచ్చారు. ఇన్నాళ్లూ విూరు ఆడుకున్నారు, ఇకపై అనిల్‌ ఆట చూపిస్తానంటూ ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. పిల్లాడోగిగా ఉన్నప్పుడే ఓ పెద్ద కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేశానన్నారు. ఇకపై అనిల్‌ కుమార్‌ సత్తా ఏంటో చూపిస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అనిల్‌ కుమార్‌ పార్టీ మారుతున్నట్లు గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. శుక్రవారం తన అనుచరులతో అనిల్‌ భేటీ అవ్వడంతో…కీలక ప్రకటన ఉంటుంని అందరూ భావించారు. శనివారం ప్రెస్‌ విూట్‌ లో ఎన్ని కుట్రలు చేసినా తనను జగన్‌ కు దూరం చేయలేరన్నారు. తన గుండె కోస్తే అందులో కూడా ఉండేది జగన్‌ బ్లడ్‌ అన్నారు. జగన్‌ కు తాను మిలిటెంట్‌ స్క్వాడ్‌ లాంటోడినని అనిల్‌ కుమార్‌ అన్నారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ సీఎం జగన్‌ తోనే ఉంటానని ఆయన స్పష్టంచేశారు.నిన్న సిటీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో అనిల్‌ కుమార్‌ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశంలో సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. అయితే ఇవాళ్టి ప్రెస్‌ విూట్‌ లో టీడీపీపై విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌ ఫైర్‌ అయ్యారు. లోకేశ్‌ అసలు పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. జగన్‌ పాదయాత్రలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు ప్రజల్లోనే కలిసి ఉండేవారని గుర్తుచేశారు. లోకేశ్‌ నువ్వు మగాడివైతే టైమ్‌, ప్లేస్‌ చెప్పు మనిద్దరం చర్చకు కూర్చుందామని తీవ్ర స్థాయిలో అనిల్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా ప్రభావంతో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సమయం పట్టిందన్నారు. అయినా కూడా ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు కృషి చేశానన్నారు. వైసీపీ ప్రభుత్వమే నెల్లూరు, సంగం బ్యారేజ్‌ పూర్తి చేసిందన్నారు.టీడీపీకి దగ్గరైనా ఆనం రామనారాయణ రెడ్డిపై అనిల్‌ కుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఆనం జగన్‌ దయతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గురించి అందరూ మర్చిపోయారన్నారు. ఆనం కుటుంబాన్ని ఆనం విజయ్‌ కుమార్‌ రెడ్డి వల్లే గుర్తుపెట్టుకున్నారన్నారు. గతంతో మంత్రిగా చేసిన ఆనం నెల్లూరు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆనం ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓటమి తథ్యమని జోస్యంచెప్పారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన వైసీపీకేం నష్టం లేదన్నారు. ముగ్గురు స్క్రాప్‌ ఎమ్మెల్యేలను తామే పార్టీ నుంచి విసిరేశామని అనిల్‌ అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఇకపై పాత అనిల్‌ ను చూస్తారన్న ఆయన… 2024లో మళ్లీ తానే పోటీచేస్తానని స్పష్టంచేశారు. ఇకపై తనను ఎవ్వడు ఆపుతాడో చూస్తానంటూ వ్యాఖ్యానించారు. తనకు ఎవ్వడు అడ్డొచ్చినా బుల్లెట్‌ ట్రైన్‌ స్పీడ్‌తో గుద్దేస్తానన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *