మూడో షెడ్యూల్‌ పూర్తి.. తదుపరి ఏంటంటే

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) కీలక పాత్రలో సుజీత్‌ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓజి’ (OG) (వర్కింగ్‌ టైటిల్‌). శరవేగంగా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌ వారాహి విజయ యాత్రలో(Vaarahi Vijaya Yatra) ఉన్నప్పటికీ ఆయన లేని సన్నివేశాలను, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన మూడో షెడ్యూల్‌ ఆదివారంతో పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ‘దీనితో 50 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయింది. రానున్న రోజులు మరింత ఎగ్జైటింగ్‌గా ఉండబోతున్నాయి’ అంటూ టీమ్‌ అంతా కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. (Third Schedule Completed)గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్‌ స్టైలిష్‌ మేకింగ్‌తో రూపొందిస్తున్నారు. పాత్రల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌, శ్రియారెడ్డి, అర్జున్‌ దాస్‌, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హస్మీ, హరీశ్‌ ఉత్తమన్‌ ఇలా భారీ బృందంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు డి.వి.వి.దానయ్య. ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌ ప్రేక్షకులకు తెలియజేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. అంతే కాదు ఈ సినిమాలో పని చేస్తున్న కొందరు తారలు చెప్పుకొచ్చిన విషయాలు కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వచ్చే నెలలో తదుపరి షెడ్యూల్‌ ఉంటుందని తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌ సరసన ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *