పెరుగుతున్న మద్యం ఆదాయం

కొంతకాలంగా ఏపీలో రాజకీయాలననీ మద్యం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌?ఆ తర్వాత మద్యం ఏరులై పారిస్తున్నారు. ఇదేంటి విూరిచ్చిన హావిూ ఏమైందని వైసీపీ నేతలను అడిగితే?అసలు మేనిఫెస్టోలో మద్యపాన నిషేధమే లేదంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ రెడ్డి వంటి వారు బుకాయిస్తున్నారు. ఇక, తాజాగా దిల్లీలోని మద్యం టెండర్ల వ్యవహారంల ? వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేరు మార్మోగిపోతోంది. ఆప్‌ ప్రభుత్వాన్ని మాగుంట ఇరకాటంలో పడేశారని టాక్‌ వస్తోంది.మద్యం పాలసీ ద్వారా కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించారని ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రూ.144 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిరదని ఆరోపిస్తోంది. అలా లబ్ధి పొందిన కంపెనీల్లో మాగుంటకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, దిల్లీ మద్యం విధానంలో తమకు లబ్ధి జరిగిందనే ప్రచారంలో వాస్తవం లేదని మాగుంట చెబుతున్నారు. మద్యం విక్రయాల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ఈ విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్‌ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని ప్రభుత్వం వెల్లడిరచింది.ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. పలు బ్రాండ్లపై ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో దిల్లీలో అమ్మకాలు పెరిగాయి. దీంతో, ఎక్సైజ్‌ టెండర్ల కేటాయింపు, డిస్కౌంట్లు అందించే ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బ్లాక్‌ లిస్టులో పెట్టిన కొన్ని కంపెనీలను టెండర్‌ ప్రక్రియలో అనుమతించారని బీజేపీ నేతలు ఆరోపించారు.బ్లాక్‌ లిస్టులో ఉన్న ఖావో గాలి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చెందిన కంపెనీతో పాటుగా ఇండో స్పిరిట్‌ కలిసి సిండికేట్‌ అయ్యి బిడ్లు గెలుచుకున్నారు. చివరకు ఈ వివాదం కారణంగా దిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 9 నెలల తర్వాత తన మద్యం విధానం వెనక్కి తీసుకుంది. మళ్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలకు శ్రీకారం చుడతామని చెప్పింది. సెప్టెంబరు 1 నుంచి పాత విధానం అమల్లోకి వస్తుందని చెప్పింది. బీజేపీ నేతలు ఆరోపించే సమయంలో వైసీపీ ఎంపీ మాగుంట పేరుని కూడా ప్రస్తావించడంతో కేజ్రీవాల్‌ ను మాగుంట ఇరకాటంలో పడేసినట్లయింది.
జనసేనాని ప్రశ్నల పర్వం
రాజకీయాల్లో అమలు చేయని హావిూలని ఇవ్వకూడదు?ఒకవేళ ఇచ్చిన వాటి అమలకు చిత్తశుద్ధితో పనిచేయాలి..కనీసం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిన కనీసం?కొంత వరకు అమలు చేయడానికి కృషి చేయాలి?అలా కాకుండా హావిూలు విషయంలో మాట తప్పి, మడమ తిప్పితే చాలా ఇబ్బంది. మామూలుగా మాట తప్పడం వల్లే చంద్రబాబు అధికారం కోల్పోయారు. కానీ తాను మాట తప్పను, మడమ తిప్పను అని జగన్‌ అధికారంలోకి వచ్చారు.మరి అధికారంలోకి వచ్చాక జగన్‌ మాట తప్పారా? మడమ తిప్పారా? అంటే పలు హావిూల విషయంలో జరిగిందనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలని?అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో అమలు చేయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందనే చెప్పొచ్చు. అయితే మద్యపాన నిషేధం విషయంలో జగన్‌?పూర్తిగా మాట తప్పారని చెప్పొచ్చు. మద్యపాన నిషేధం అనేది సాధ్యం అవ్వని హావిూ?కానీ జగన్‌?అధికారంలోకి వస్తే అక్కాచెల్లెమ్మలకు కోసం మద్యపాన నిషేధం చేస్తానని అన్నారు.అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెబుతూ?వైన్‌ షాపులని తగ్గించడం, ప్రభుత్వమే షాపులని నడపటం, మద్యం ధరలు భారీగా పెంచితే మద్యం తాగేవాళ్లు తగ్గుతారని చెప్పడం లాంటివి చేశారు. ఇక ఎన్ని చెప్పిన ఆదాయం వస్తూనే ఉంది?మద్యం తాగేవాళ్లు తగ్గడం లేదు?పైగా ప్రభుత్వం పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్ముతుందనే విమర్శలు తెచ్చుకుంది. ఈ విధంగా మద్యపాన నిషేధంలో మడమ తిప్పుతూ వచ్చారు. కొంచెం కొంచెం అయితే పర్లేదు?కానీ తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఏకంగా?తమ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం హావిూని లేదని పూర్తిగా అబద్దం చెప్పేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *