బస్సులో మంటలు
సికింద్రాబాద్ బేగంపేట్ లో ఏసీ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. తెలంగాణ ఆర్టీసీకి చెందిన శంషాబాద్ నుంచి జేబీఎస్ కు వెళ్లే ఎయిర్పోర్ట్ బస్సులో ఒక్కసారిగా బస్సు పై భాగం లోని ఏసీ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి.. విషయం గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.. వాహనదారుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాప సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.. ప్రమాదానికి కారణం ఏసీలో షార్ట్ సర్క్యూట్ అని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు