యాదాద్రిని వెక్కిరిస్తున్న పెండిరగ్‌ బిల్లులు

యాదాద్రి జిల్లాలో డెవలప్మెంట్‌ వర్క్స్‌? ప్రోగ్రెస్‌?పై పెండిరగ్‌ బిల్లుల ప్రభావం పడుతోంది. నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌?లు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్‌? డెవలప్‌?మెంట్‌? ఫండ్‌? (ఎస్‌?డీఎఫ్‌?) కింద పంచాయతీలు, మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున డెవలప్మెంట్‌? వర్క్స్‌? మంజూరు చేస్తున్నట్టు దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ రెండేండ్ల కింద ప్రకటించారు. యాదాద్రి జిల్లాకు 2430 వర్క్స్‌?కు రూ. 108 కోట్ల ఫండ్స్‌?వస్తున్నట్టు తేలింది. దీంతో జిల్లాలోని సర్పంచ్‌?లు, బీఆర్‌?ఎస్‌? లీడర్లు ఆశపడ్డారు. రూ. 5 లక్షల లోపు పనులను నామినేటెడ్‌?గా సర్పంచ్‌?లు, పార్టీ లీడర్లకు ఎమ్మెల్యేలు కేటాయించడంతో మరింత ఆనందంలో మునిగిపోయారు. ఈ ఆనందంలో కొందరు సర్పంచ్‌?లు, లీడర్లు జిల్లా వ్యాప్తంగా రూ. 28 కోట్ల విలువైన 370 పనులు ప్రారంభించారు. వీటిలో సగానికిపైగా వర్క్స్‌? కంప్లీట్‌?అయ్యాయి. సర్పంచ్‌?లు, కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిన వాళ్లకు కవిూషన్లు ఇచ్చి బిల్లులకు సంబంధించిన చెక్కులను ఈ కుబేర్‌?లో ఎంట్రీ చేయించారు. సెక్రటేరియట్‌?కు వెళ్లిన చెక్కులు వెళ్లినట్టే ఆగిపోయాయి. నిధుల లేమి కారణంగా ఆరు నెలలు గడుస్తున్నా బిల్లులు రిలీజ్‌? కావడం లేదు. దీంతో కొత్తగా వర్క్స్‌? ప్రారంభించడానికి ఎవరూ ముందుకు
రావడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్‌?) కింద పనులు చేపట్టిన సర్పంచ్‌?లు, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా రావడం లేదు. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీడీఎఫ్‌? కింద రూ. 3 కోట్ల డెవలప్‌?మెంట్‌ వర్క్స్‌? చేపట్టవచ్చు. దీంతో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తమతమ నియోజకవర్గాల్లో కొన్ని వర్క్స్‌? కేటాయించారు. నకిరేకల్‌ నియోజకవర్గంలోని రామన్నపేట, మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, నారాయణపురం, తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పనులు చేయించారు. కానీ ఈ వర్క్స్‌?కు సంబంధించిన బిల్లుల చెక్కులు కూడా సెక్రటేరియట్‌?లోనే ఆగిపోయాయి. ఎస్‌?డీఎఫ్‌, సీడీఎఫ్‌?తో పాటు కలెక్టర్‌?ఆధీనంలోని కృషీయల్‌?బ్యాలెన్స్‌? ఫండ్‌? (సీబీఎఫ్‌?) చెక్కులు కలిపి 300కు పైగా సెక్రటేరియట్‌?లో నిలిచిపోయాయి. ఈ చెక్కుల విలువ సుమారు రూ. 20 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వివిధ డిపార్ట్‌?మెంట్స్‌? హెచ్‌?వోడీల వెహికల్స్‌? అలవెన్స్‌? కూడా ఆపేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో దాదాపు 60 మంది హెచ్‌?వోడీలు, మరో 50 మంది ఇతర ఆఫీసర్లకు వెహికల్స్‌? అలవెన్స్‌? ఇస్తోంది. ఒక్కొక్కరికీ రూ. 32,340 చొప్పున అలవెన్స్‌? ఇవ్వాల్సి ఉంది. అయితే ఆరు నెలలుగా ఈ అలవెన్స్‌?ను ఇవ్వడం లేదని సమాచారం. ఈ లెక్కన దాదాపు రూ. 2 కోట్ల వరకూ ఆఫీసర్లకు వెహికల్స్‌? అలవెన్స్‌? రావాల్సి ఉంది. డెవలప్‌?మెంట్‌? వర్క్స్‌?కు సంబంధించిన బిల్లులైతే మళ్లీ మొదటి నుంచి ప్రారంభించి చెక్కులను తిరిగి ఈ కుబేర్‌?లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆఫీసర్స్‌? వెహికల్స్‌? అలవెన్స్‌? మాత్రం ఇక రానట్లే. దీంతో ఆరు నెలల అలవెన్స్‌? తాము నష్టపోతున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *