ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఒక కారు ఢీకొంది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణి డాం సవిూపంలో ఘటన జరిగింది. మృతుడు భాకరాపేట బీసీ కాలనీకి చెందిన రెడ్డి ప్రసాద్ (21) గా గుర్తించారు. రెడ్డి ప్రసాద్ భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్దీకరించారు.