Agnipathకు వ్యతిరేకంగా ఆందోళన

సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పలు రాష్ట్రాల్లో ఉధృతంగా ఆందోళన చేస్తున్నారు. సోమవారం కూడా చెన్నైలోని కొళత్తూరు, తిరువిక నగర్‌, సైదాపేట ప్రాంతాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరువిక నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని పట్టాళం జంక్షన్‌ వద్ద రాష్ట్ర కార్యదర్శి గుణశేఖరన్‌ సారథ్యంలో ఈ ఆందోళన జరిగింది. అలాగే, కొళత్తూరులో పెరవళ్ళూరు కామరాజర్‌ విగ్రహం వద్ద ఈ ధర్నా జరిగింది. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *