నితీష్‌ కుమారే ప్రత్యామ్నాయమా

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ యాదవ్‌ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎదురు నిలబడేందుకు కలిసి రావాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌ని కలిశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే బిహార్‌లోని పట్నాలో విపక్షాల ఐక్యతా సమావేశాన్ని నిర్వహించారు. జేడీయూ, ఆర్‌జేడీతో పాటు దాదాపు 15 పార్టీల కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలోని కీలక నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2024 ఎన్నికల వ్యూహాలు రెడీ చేసే బాధ్యతను నితీష్‌ కుమార్‌కే ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ఆయనే కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ భేటీలో మమతా బెనర్జీ, రాహుల్‌ గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌, శరద్‌ పవార్‌ పాల్గొన్నారు. అయితే…ఇంత కీలక సమావేశంలో ప్రముఖ నేతలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీపై యుద్ధం ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరు కాలేదు. అటు బీఎస్‌పీ అధినేత మాయావతి, ఏఐఎంఐఎం లీడర్‌ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా రాలేదు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బీఆర్‌ఎస్‌ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. విపక్షాలు యునిటీగా పోరాటం చేయాలని నితీష్‌ కుమార్‌ భావిస్తున్నా…కొన్ని పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు తలెత్తుతున్నాయి. వాటిని తీర్చేందుకు నితీష్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. భేటీ జరిగే ముందు కూడా ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్రం ఢల్లీిలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఈ రెండు పార్టీలు తలోవాదన వినిపించాయి. ఈ ఆర్డినెన్స్‌ విషయంలో బీజేపీతో కాంగ్రెస్‌ కుమ్మక్కైందని ఆప్‌ ఆరోపిస్తోంది. అటు కాంగ్రెస్‌ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తోంది. ఒక్క ఆప్‌ మాత్రమే కాదు. టీఎంసి కూడా కాంగ్రెస్‌ని టార్గెట్‌ చేసింది. పంచాయత్‌ ఎన్నికల్లో చెలరేగిన హింసకు కాంగ్రెస్‌ కారణమని ఆరోపించింది. పంజాబ్‌లో ఆప్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ పోరు నడుస్తోంది. కేరళలో లెఫ్ట్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ ఫైట్‌ నెలకొంది. ఎలా చూసినా…విపక్షాల మధ్య మైత్రి కుదరడం లేదు. అన్ని పార్టీలు ఏకమై కచ్చితంగా బీజేపీతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. అటు ఖర్గే కూడా ఇదే ప్రకటన చేశారు. విపక్షాలను ఒక్కటి చేయడంలో రాహుల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు. బిహార్‌లో గెలిస్తే దేశాన్ని గెలిచినట్టే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఖర్గే. పార్టీలతో చిన్న చిన్న విభేదాలున్నప్పటికీ బీజేపీపై పోరాటం చేసేందుకు అందరూ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. 2024 ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఓడిరచేందుకు దేశంలోని అన్ని బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ సమావేశం ఉద్దేశం. ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే సహా మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, తేజస్వీ యాదవ్‌, స్టాలిన్‌, అఖిలేష్‌ యాదవ్‌ తదితర ప్రాంతీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధినేతలు, సీఎంలు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు ధ్రువీకరించారు. అయితే ఈ కీలక సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏ ప్రాంతీయ పార్టీలు పాల్గొనడం లేదు. ఏపీ, టీఎస్‌లో మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధికార పార్టీ అయితే, టీడీపీ ప్రధాన ప్రతిపక్షం. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా, గత టీడీపీ ప్రభుత్వంపైనా అవినీతి, దుష్పరిపాలన ఆరోపణలు చేస్తూ బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు వైఎస్సార్‌సీపీ, టీడీపీలను టార్గెట్‌ చేస్తున్నప్పటికీ ఏపీలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెండూ కూడా బీజేపీతో స్నేహ బంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నాయి. మరోవైపు హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముగిసిన తర్వాత రెండేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. అయితే ఢల్లీి మద్యం కుంభకోణం కేసులో తన కూతురు కవిత పేరు బయటకు రావడంతో కేసీఆర్‌ ఒక్కసారిగా బీజేపీపై మౌనం వహించారు. ఆ తర్వాత కేసీఆర్‌ మళ్లీ కాంగ్రెస్‌ పై విరుచుకుపడటం మొదలు పెట్టారు. ఈ పరిస్థితుల్లో పాట్నా సమావేశానికి దూరంగా ఉండాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలలో ఏ ఒక్కటీ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ల ఆగ్రహానికి గురికాకుండా తమ తమ రాష్ట్రాలకే పరిమితమయ్యేందుకు మొగ్గుచూపుతున్నారు.నితీష్‌ కుమార్‌ విషయానికొస్తే…ఆయన 2024 ఎన్నికల్లో ప్రధాని రేసులో ఉంటారన్న ప్రచారమూ జరుగుతోంది. దీనిపై ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *