11 నుంచి 15 వరకు తిరుమలకు రావొద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 15 వరకు వరస సెలవులు ఉండటంతో భక్తులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సెలవుల కారణంగా తిరుగిరులకు భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున భక్తులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది. రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని, తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడవద్దని టీటీడీ ప్రకటించింది. ముందస్తు ప్లాన్‌ ప్రకారంగా దర్శనం టికెట్లు, రూమ్‌ బుకింగ్‌ వంటి సౌకర్యాలను ముందుగానే చేసుకుని రావాలని తెలిపింది. రద్దీ నెలకొనే అవకాశమున్నందున వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 19 వరకు సెలవులు, తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. కాబట్టి ఈ సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి నిర్ణీత వేళల్లోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రావచ్చని టీటీడీ స్పష్టం చేసింది.మరోవైపు.. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5 వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండున్నరేళ్ల తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుమాడ వీధుల్లో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్‌ తప్పని సరిగా ధరించడంతో పాటు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులకు అన్నప్రసాదం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీకి తగ్గట్టు రోజుకు 9 లక్షల లడ్డూలు పంపిణీ కి సర్వం సిద్ధం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *