అడ్డంగా బుక్కైన మాధవ్‌… కఠిన నిర్ణయం తప్పదా

ఏపీ రాజకీయాల్లో వైసీపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో కాల్‌ వ్యవహారం పెద్ద సెన్సెన్షన్‌ గా మారిన విషయం తెలిసిందే. ఓ మహిళాతో మాధవ్‌ న్యూడ్‌ గా మాట్లాడిన వీడియో కాల్‌ ఒకటి..తాజాగా బయటపడిరది..వీడియో వచ్చిన కొద్ది సమయంలోనే సోషల్‌ విూడియా, విూడియాలో వైరల్‌ గా మారింది. ఇలా వీడియో వైరల్‌ కావడంతో..ఎంపీ మాధవ్‌ విూడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు?అది మార్ఫింగ్‌ చేశారని,ఇదంతా టీడీపీ వాళ్ళ పని అని, టీడీపీ అనుకూల విూడియా పని అని చెప్పి?యథావిధిగా టీడీపీపై ఫైర్‌ అయ్యారు. అలాగే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన?నిజనిజాలు తేలుతాయని చెప్పారు.సరే మాధవ్‌ వీడియో మార్ఫింగ్‌ చేశారనేది నిజమో కాదో?పోలీసుల విచారణలో తేలుతుంది?కానీ ఈలోపు ఈ వీడియో వల్ల వైసీపీకి డ్యామేజ్‌ జరిగేలా ఉంది. పైగా ఈ అంశంపై మాధవ్‌ ఒక్కరే వచ్చి..ఖండిరచారు తప్ప..ఏ ఒక్క వైసీపీ నేత కూడా విూడియా ముందుకు రావడమో..లేక సోషల్‌ విూడియా వేదికగా మాధవ్‌ వీడియోని మార్ఫింగ్‌ చేశారని ఖండిరచలేదు. అలాగే వైసీపీ అనుకూల విూడియాలో కూడా మాధవ్‌ కు అనుకూలంగా కథనాలు రావడం లేదు. అసలు మాధవ్‌ వ్యవహారంలో సొంత పార్టీ మద్ధతు గాని, సొంత విూడియా మద్ధతు గాని రావడం లేదు.
దీని బట్టి చూస్తుంటే?మాధవ్‌ వ్యవహారంలో జగన్‌ సీరియస్‌ గా ఉన్నారని అర్ధమవుతుంది..ఇప్పటికే ఆ వ్యవహారం నిజమని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో జగన్‌?మాధవ్‌ ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.అయితే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమే కాకుండా?ఎంపీ పదవి నుంచి వైదొలిగేలా జగన్‌ సంచలన నిర్ణయం తీసుకుంటారని సమాచారం?ఇలాంటి అంశాలని ఉపేక్షిస్తే లాభం ఉండదని, దీని వల్ల పార్టీకి డ్యామేజ్‌ జరగొచ్చని జగన్‌ భావిస్తున్నారట. మొత్తానికి మాధవ్‌ విషయంలో జగన్‌ సంచలన నిర్ణయమే తీసుకుంటారని తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *