యూపీలో మరో దారుణం…భార్యను చంపి, ముక్కలుగా కోసి…
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణమైన శ్రద్ధా వాకర్ హత్య కేసు మరవక ముందే అలాంటిదే మరో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) సీతాపూర్లో వెలుగులోకి వచ్చింది.(UP Man Kills Wife) ఈ కేసులో మహిళ మృతదేహాన్ని హంతకులు ముక్కలుగా నరికి సుదూరప్రాంతంలో పడేశారు.(Chops Body Into Pieces)ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలోని రాంపూర్ కలాన్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గులారిహాలో జ్యోతి అలియాస్ స్నేహ అనే మహిళ మృతదేహాన్ని నవంబర్ 8వతేదీన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు పంకజ్ మౌర్య,దుర్జన్ పాసిని అరెస్టు చేశారు.
హత్యకు గురైన మహిళ నిందితుల్లో ఒకరైన పంకజ్ మౌర్య భార్య.రాంపూర్ కలాన్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గులారిహాలో మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు పంకజ్ మౌర్య తన సహచరులలో ఒకరితో కలిసి తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.జ్యోతి అలియాస్ స్నేహ అనే మహిళ నిత్యం డ్రగ్స్ తీసుకునేదని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.పంకజ్ మౌర్య అనే నిందితుడు తనకు వివాహమై పదేళ్లకు పైగా అయినా జ్యోతి తనను మోసం చేస్తుందనే అనుమానంతో ఆమెను అంతమొందించాలని భర్త పంకజ్ నిర్ణయించుకున్నట్లు సీతాపూర్ పోలీసులు చెప్పారు.