తిరుపతి` గుంటూరు రైలులో దోపిడీ దొంగల బీభత్సం

తిరుపతి నుంచి గుంటూరు వెళుతున్న రైలు లో దొంగలు రెచ్చిపోయారు. కడపజిల్లాలో అర్ధరాత్రి ఇరుగపాడు రైల్వేస్టేషన్‌ దగ్గర దొంగలు బోగీలోకి చొరబడ్డారు. మహిళల మెడలో నుంచి బంగారం లాక్కెళ్లారు. ఎస్‌1 నుంచి ఎస్‌6 బోగీ వరకు దోపిడీ చేసారు. రైలులోకి చొరబడిన దొంగల సంఖ్య 20 నుంచి 25 మంది వుండవచ్చని సమాచారం. పోలీసులు దొంగలముఠా కోసం గాలిస్తున్నారు. చోరీ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైయారు. గత అక్టోబరులో కూడా డెక్కన్‌ రైలులో బీభత్సం దొంగలముఠా సృష్టించిన విషయం తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *