కొత్త సెక్రటేరియెట్ లో నీళ్లు
తెలంగాణ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ ను ఎంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, ప్రారంభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రూ.600 కోట్లకు పైగా నిధులు వెచ్చించి రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా, జాతి గర్వపడేలా నిర్మించారు. అయితే, సెక్రటేరియట్ పైన నీరు నిలిచిపోయిందని తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఆ నీళ్లని తోడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. రాష్ట్రంలో విపక్షాలకు చెందిన సోషల్ విూడియా గ్రూపుల్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఆ భవనం తెలంగాణ సెక్రటేరియట్ ను పోలినవిధంగానే ఉంది.అంతేకాకుండా, కొత్త సచివాలయం విూడియా సెంటర్లోకి కూడా రెండు రోజు రోజుల క్రితం వాటర్ లీక్ అయిన విషయం బయటికి వచ్చింది. శ్లాబ్ విూద నిలిచిన నీరు హాల్లోకి లీక్ అయిందని, పిల్లర్కి కూడా పగుళ్ళు వచ్చాయని ఫోటోలు బయటికి వచ్చాయి. దానికి తోడు శ్లాబ్ నుంచి నీటి చెమ్మగా మారినట్లుగా ఆ ఫోటోల్లో కనిపించింది. రెండ్రోజుల క్రితం తొలి రోజు సెక్రటేరియట్ కి వచ్చిన ఉద్యోగుల ఫీలింగ్ తెలుసుకోడానికి అక్కడికి చేరుకున్న విూడియా ప్రతినిధులకు ఆ సెంటర్ లో నీళ్లు కనిపించాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో సచివాలయాన్ని కట్టినా విూడియా సెంటర్ విషయంలో నిర్లక్ష్యం ఏంటని విలేకరులు ప్రశ్నించారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ విూడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు, టీఆర్ఎస్ వ్యతిరేకులు కామెంట్లు చేశారు. అకాల వర్షాలకే విూడియా సెంటర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక తుపాను సమయాల్లో, వర్షాకాలంలో ఇంకెంత ఘోరంగా ఉంటుందోనని కామెంట్లు చేశారు.అయితే, సోషల్ విూడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నట్లుగా కొత్త సచివాలయంపైన నీరు నిలవడం, విూడియా సెంటర్ లోకి నీళ్లు కారడం లాంటి విషయాలను సచివాలయ వర్గాలు ధ్రువీకరించలేదు.