సంపాదన అర్ధ రూపాయి, ఖర్చు రూపాయి’

దేశంలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ కుదేలవుతున్నది. 2022`23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలలలో అంటే ఏప్రిల్‌, మే, జూన్‌లోనే నాలుగు లక్షల కోట్ల నష్టం జరిగింది. అసలే అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చినపుడు రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. సహజంగా నష్టం ఏడు శాతం కన్నా ఎక్కువగా ఉండకూడదు. కానీ, 21 శాతం వరకు రావడం ఆందోళన కలిగిస్తున్నది. గత పదేండ్లలో దేశంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ లేదు. నిజానికి సంపాదన రూ.5,68,000 కోట్లు ఉంటే, ఖర్చు రూ.9,47,000 కోట్లు ఉంది. అందుకే నష్టం జరిగింది. జీతాలు, పెన్షన్‌లకే రూ.7,70,000 కోట్లు ఖర్చు అవుతున్నది. గతంలో ఎన్నడూ ఇంత తేడా సంపాదనలోగానీ, ఖర్చులోగానీ లేదు. ‘సంపాదన అర్ధ రూపాయి, ఖర్చు రూపాయి’ అన్నట్టుగా తయారైంది పరిస్థితి.విదేశాలలో అమ్ముతున్న ప్రొడక్ట్స్‌ మన వద్ద అమ్మినపుడు నష్టాలు ఎందుకు? విదేశాలలో లాభాలెందుకు? ఈ అంతు చిక్కని ఆర్థిక నీతిలో ఆంతర్యం ఏమిటో? పాలకులే సమాధానం చెప్పాలి. గవర్నెస్‌ లావిష్‌నెస్‌, రాజరికం దేశాన్ని మరింత కష్టాలలోకి నెడుతున్నది. విదేశీ పెట్టుబడులు తగ్గుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలు పెరుగుతున్నాయి. ఉత్పత్తులు తగ్గి దిగుమతులు పెరిగాయి. ఉపాధి తగ్గినా, పెరగకున్నా ప్రభుత్వ రెవెన్యూలో 80 శాతం జీతాలు, పెన్షన్‌కే పోతున్నాయి. 41 శాతం ప్రజల విూద టాక్స్‌ భారం పెంచేసారు. కార్పొరేట్‌ల విూద మూడు శాతమే టాక్స్‌ భారం ఉంది. నాన్‌ టాక్స్‌ రెవెన్యూ 70 శాతం తగ్గింది. ఎకానవిూని కాపాడలేని పరిస్థితి ఉంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అతి తక్కువగా అంటే, రూ. 30,330 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చింది. గతంలో రూ.1,75,000 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు దారుణంగా తగ్గించి ఇచ్చింది. ఇందుకు కారణం కార్పొరేట్‌ల రుణాలు, ప్రభుత్వం వారికి ఇచ్చిన రాయితీలు, రిటర్న్‌ ఆఫ్‌లు మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.కోర్‌ సెక్టర్‌ అయిన బొగ్గు ఉత్పత్తి గ్రోత్‌ 31 శాతం పెరిగింది. అయినా అదానీలాంటి కార్పొరేట్‌లకు లాభం చేయడానికి నిర్ణయించుకున్నారు. రూ.3,000 ధర ఉన్న టన్ను బొగ్గును రూ.30,000కు ఆయన నుంచి కొనుగోలు చేయించింది ప్రభుత్వం. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇందుకు ఒప్పుకోలేదు. కష్టాలలో కూడా సింగరేణి తన వినియోగదారులకు బొగ్గును ఒప్పందం మేరకు సరఫరా చేయడం అభినందనీయం. ప్రపంచంలో క్రూడ్‌ ఆయిల్‌కు మంచి గిరాకీ వచ్చిన నేపథ్యంలో దేశంలోని ఇండియన్‌ ఆయిల్‌ ఉత్పత్తిని 66 శాతం తగ్గించి వేయడం జరిగింది. గతంలో 541 కోట్ల లాభం పొందిన ఇండియన్‌ ఆయిల్‌ ఈసారి ప్రభుత్వ విధానాల వలన రెండు వేల కోట్లు నష్టపోయింది. నేచురల్‌ గ్యాస్‌ పరిస్థితి అంతే.ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం వలన స్టీల్‌ ఉత్పత్తి పెరిగింది. సిమెంట్‌ ఉత్పత్తి 19 శాతం పెరిగినప్పటికీ 42 శాతం ప్రాజెక్టుల పనులు ఆగి ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి 15 శాతం పెరిగింది. అయితే, ఏక కాలంలో రూ. 60 వేల కోట్ల ఖర్చు పెరిగింది. ఈ ఏడు సంవత్సరాలలో 22 కోట్ల నిరుద్యోగులు తయారయ్యారు. కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలు ఏడు లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల పీఎం నరేంద్ర మోదీ ప్రకటించిన పది లక్షల ఉద్యోగాల నియామకం జరగాల్సిన ఉంది. మన దేశం నుంచి రూ.2.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవడం జరిగింది. శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ లాంటి దేశాల ఎకానవిూ దెబ్బ తిన్న నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2023`2024 ఎలక్షన్‌ సంవత్సరాలు కానున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు రూ.70 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేంద్రం అప్పు 135 లక్షల కోట్ల రూపాయలు దాటింది.2024 నాటికి ఈ అప్పులు దేశంలో రూ.135 లక్షల కోట్ల నుంచి 155 లక్షల కోట్లకు పెరిగే పరిస్థితి ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకుల రిటర్న్‌ ఆఫ్‌ రూ.10 లక్షల కోట్లు దాటనుంది. అధిక ధరలు, నిరుద్యోగం, అసమానతలు ఇంకా పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికైనా అప్పులను తగ్గించుకుంటూ ఉత్పత్తి రంగంపై దృష్టి సారిస్తే అద్బుతాలు మనం చూడవచ్చు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *