హస్తానికి ఐదు రాష్ట్రాల పరీక్ష

5 రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. 2024 లోక్సభ ఎన్నికలకు సెవిూఫైనల్గా నిలువనున్న ఈ అసెంబ్లీ సమరాన్ని పార్టీలన్నీ సీరియస్గా తీసుకున్నాయి. ముఖ్యంగా.. కేంద్రంలో 9ఏళ్లుగా విపక్షంలో కూర్చుండిపోయి, ఉనికిని పూర్తిగా కోల్పోయే స్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్కు.. ఇది నిజంగా అగ్ని పరీక్షే!తెలంగాణ, ఛత్తీస్గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరంలో నవంబర్‌ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఛత్తీస్గఢ్‌, రాజస్థాన్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. 2018 మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో మెజారిటీ ఉండి, ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ.. తిరుగుబాటు జ్వాలలతో దానిని కాపాడుకోలేక, అధికారాన్ని బీజేపీకి అప్పగించింది.రాజస్థాన్‌ ఈ రాష్ట్రంలో బీజేపీతో పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం.. కాంగ్రెస్లోని అంతర్గత యుద్ధం. 2018 రాజస్థాన్‌ ఎన్నికల్లో గెలవడమే ఆలస్యం.. సీఎం అసోక్‌ గహ్లోత్‌, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్ల మధ్య తీవ్రమైన విభేదాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు కూడా.. ఈ వ్యవహారం తరచూ వార్తలకెక్కేది. ఒకానొక దశలో.. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింథియా చేసినట్టు (కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం), సచిన్‌ పైలట్‌ కూడా తిరుగుబాటు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం దాదాపుగా కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడిరది. కానీ వెంటనే స్పందించిన హైకమాండ్‌.. సచిన్‌ పైలట్ను బుజ్జగించింది. అయినప్పటికీ.. పార్టీపై ఆయన ఒకింత అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది.అయితే.. ఇక్కడ బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు కనిపిస్తుండటం.. కాంగ్రెస్కు కలిసి వచ్చే విషయం! కమలదళంలో సీనియర్‌ లెవల్‌ నేతలకు పాడటం లేదని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికలు వచ్చేసరికి.. ఏవిూ జరగనట్టు, పార్టీలో నేతలందరు బయటకు నవ్వుతూ కనిపిస్తున్నారు.మరోవైపు.. గత కొన్ని నెలలుగా రాజస్థాన్లో నేరాలు అత్యంత ఆందోళనకర స్థాయికి చేరాయి. అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్లు.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. చాలాసార్లు.. ఇవి గహ్లోత్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటి ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుందనేది చూడాలి.ఛత్తీస్గఢ్‌:` ఇక్కడ.. కాంగ్రెస్కు పైచేయి ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. సీఎం భూఫేస్‌ భగేల్‌ తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు క్లిక్‌ అయినట్టు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మధ్యప్రదేశ్‌:` ఇక్కడ బీజేపీపై కాస్త అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పనితీరుపై అధిష్ఠానం సంతృప్తిగా లేదని, ఈసారి గెలిస్తే.. ఆయన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇది కాంగ్రెస్కు ఒకింత కలిసి వచ్చే విషయం. కాంగ్రెస్‌ కూడా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. 2018 తెలంగాణ ఎన్నికలతో పోల్చుకుంటే.. రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్‌ పుంజుకుందనే చెప్పాలి! రేవంత్‌ రెడ్డీ నేతృత్వంలో బీఆర్‌ఎస్పై ఆ పార్టీ గట్టిగానే పోరాటం చేస్తోంది. వాస్తవానికి ఇక్కడ బీజేపీ బలంగా మారు?తుందని అందరు భావించినా.. కమలదళం ఇక్కడ కాస్త వెనకడుగు వేసింది. ఫలితంగా బీఆర్‌ఎస్తో కాంగ్రెస్‌ పోరాటం మరింత తీవ్రతరం చేసింది.మిజోరంలోనూ పాగా వేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అక్కడి ప్రజలను ఆకట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.ఇటీవలే బయటకు వచ్చిన పలు సర్వేల ప్రకారం.. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్గఢ్‌, తెలంగాణలో కాంగ్రెస్కు సానుకూలత అధికంగా ఉంది. రాజస్థాన్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. మిజోరంలో హంగ్‌ ఏర్పడొచ్చు!5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను ఆకట్టుకునే విధంగా హావిూలు ఇస్తోంది. నిరుడు కర్ణాటకలో సాధించిన భారీ విజయంతో నూతన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌.. అదే తరహాలో ఇతర రాష్ట్రాలపైనా ప్రభావం చూపించాలని ప్రణాళికలు రచిస్తోంది.ఇక్కడ కుల గణన గురించి ముఖ్యంగా ప్రస్తావించాలి. బిహార్లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్ని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. దీనికి కేంద్రంలోని బీజేపీ సానుకూలంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని క్యాష్‌ చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. కుల గణన అంశాన్ని తీవ్రస్థాయిలో లేవనెత్తుతోంది. అన్ని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడతామని పార్టీ నేతలు హావిూలిస్తున్నారు. కుల గణన అనేది పేదలకు ఓ శక్తివంతమైన ఆయుధం అని రాహుల్‌ గాంధీ కూడా అభిప్రాయపడ్డారు.ఈ 5 రాష్ట్రాల ఎన్నికలనే కాదు.. లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ కుల గణన అంశం తమకు సానుకూలంగా మారుతుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.2024 సార్వత్రిక సమరంలో బీజేపీని ఓడిరచాలని దేశంలోని దాదాపు అన్ని విపక్ష పార్టీలూ ఏకమైన విషయం తెలిసిందే. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. ఇండియా బృందానికి చాలా కీలకం. మరీ ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రదర్శన బలంగా ఉంటే.. ఇండియా బ్లాక్లో శక్తివంతమైన భాగంగా ఎదిగే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో సీటు షేరింగ్పై మరింత పట్టు సాధించొచ్చు.ఈ ఐదు రాష్ట్రాలను కలుపుకుంటే.. 83 లోక్సభ సీట్లు ఉన్నాయి. 2018లో రాజస్థాన్‌, ఛత్తీస్గఢ్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించినా.. 2019 సార్వత్రిక సమరంలో కాంగ్రెస్‌ పార్టీ డీలా పడిరది. ఈసారి అలా జరగకూడదని.. ప్రజలను ఆకర్షించే పనిలో పడిరది.మరి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలమైన ప్రదర్శన చేస్తుందా? లోక్సభ సమరంలో బీజేపీకి గట్టిపోటీనిస్తుందా? ఇండియా బృందం మధ్య బంధం మరింత బలపడుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడే డిసెంబర్‌ 3 వరకు వేచి చూడాల్సిందే

Leave a comment

Your email address will not be published. Required fields are marked *