ప్రకాశంలో మణిపూర్‌ తరహా ఘటన

ఒంగోలు, ఆగస్టు 17
దళిత కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి అతడితో వెళ్లిపోయిందనే కోపంతో ఓ అమ్మాయి తల్లిదండ్రులు కిరాతకంగా ప్రవర్తించారు. తమ కుమార్తె వెళ్లిపోవడం పరువు తక్కువగా భావించిన ఆమె తల్లిదండ్రులు.. సదరు యువకుడి కుటుంబంపై తీవ్ర కోపం పెంచుకున్నారు. ఎలాగైనా సరే తమ కూతురును ఇంటికి రప్పించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే భర్త చనిపోయి ఇంటివద్దే ఉంటున్న యువకుడి సోదరిపై దాడి చేయాలని నిర్ణయించుంకున్నారు. అర్ధరాత్రి వారి ఇంటికి చేరుకొని ఆమెపై దాడి చేశారు. వివస్త్రను చేసి కాళ్లూ చేతులూ కట్టేశారు. ఆపై కత్తులతో దాడి చేసి ఒంటిపై కారం పోసి విపరీతంగా హింసించారు. అలాగే నిర్బంధించి సజీవ దహనం చేయబోయారు. కానీ స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగా.. భయపడిపోయిన దంపతులు ఆమెను వదిలేశారు. పోలీసులు, స్థానికులు వెల్లడిరచిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే ఇంటి పెద్ద చాలా కాలం క్రితమే చనిపోగా… తల్లే కష్టపడి వారిని పెంచి పెద్ద చేసింది. కూతురుకు పదేళ్ల క్రితమే పెళ్లి కూడా చేసింది. కానీ ఆమె భర్త రెండేళ్ల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత నుంచి నర్సుగా శిక్షణ తీసుకున్న సదరు యువతి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. అయితే ఈమె సోదరుడు.. బొట్లపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తె ప్రేమించుకున్నారు. మార్చి నెలలో గ్రామంలోంచి వెళ్లిపోయిన పెళ్లి చేసుకున్నారు. కూతురు ఇంట్లోంచి వెళ్లిపోయి.. ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం పరువు తక్కువగా భావించిన యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ కలిసి యువకుడి ఇంటిపై దాడి చేశారు. కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టారు. తమ కూతురను తెచ్చి తమకు అప్పగించకుంటే సజీవంగానే చంపేస్తామంటూ బెదిరించారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ పై బయటకు వచ్చిన పుల్లమ్మ దంపతులు.. సదరు కుటుంబంపై మరింత కోపం పెంచుకున్నారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందురోజు అంటే సోమవారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో వారి ఇంటికి చేరుకున్నారు. అదేరోజు తల్లిని చూసేందుకు వచ్చిన బాధితురాలు.. అర్ధరాత్రి కుళాయి నీరు విడవడంతో పట్టుకోవడానికి వీధిలోకి వచ్చింది. అప్పటికే అక్కడకు చేరుకున్న బ్రహ్మారెడ్డి అతని భార్య పుల్లమ్మై ఆమెపై దాడికి పాల్పడ్డారు. వివస్త్రను చేసి కత్తులతో దాడి చేశారు. ఆపై ఒంటిపై, కళ్లలో కారం పొడి చల్లారు. కోపం చల్లారక పోవడంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించారు. కానీ అప్పటికే బయటకు వచ్చి ఈ తతంగాన్ని చూసిన పలువురు స్థానికులు.. 100 డయల్‌ కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇలా సదరు యువతి సజీవ దహనాన్ని ఆపి.. ఆమె ప్రాణాలను కాపాడారు. బ్రహ్మారెడ్డి ఇంట్లో బందీగా ఉన్న మహిళను బయటకు తీసుకొచ్చి ఆమె కాళ్లకు, చేతులకు ఉన్న కట్లను విప్పారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు అపహరణ, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు బ్రహ్మారెడ్డిని, అతడి భార్య పుల్లమ్మను అరెస్ట్‌ చేశారు. వైద్య శాలలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శిక్షణ ఐపీఎస్‌ అధికారిణి అంకిత సురానా మహవీర్‌ మంగళవారం రోజు పరామర్శించిన ధైర్యం చెప్పారు.
RRRRRRRRRRRRRRRRRRRR

Leave a comment

Your email address will not be published. Required fields are marked *