చిన్న రాష్ట్రంతో చింతలు…

జార్ఖండ్‌ లో మరోసారి ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు సాగుతున్నాయి. త్వరలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే 22 ఏళ్ల జార్ఖండ్‌ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పదవీకాలం పూర్తికాకపోవడం ఇది 11వ సారి అవుతుంది. ఇన్నేళ్లలో ఒకే ఒక్క సీఎం పదవీకాలం పూర్తి చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న రఘుబర్‌ దాస్‌ మాత్రమే పదవీకాలం పూర్తి చేయగలిగారు. అటువంటి పరిస్థితిలో ఇప్పటివరకు జార్ఖండ్‌ ముఖ్యమంత్రుల గురించి ఒకసారి చూద్దాం.15 నవంబర్‌ 2000న జార్ఖండ్‌ ఏర్పడిన తర్వాత, ఇక్కడ బీజేపీ ప్రభుత్వంలో బాబులాల్‌ మరాండీ తొలిసారిగా రాష్ట్ర అధికారాన్ని దక్కించుకుంది. నాడు కొత్తగా ఏర్పాటైన జార్ఖండ్‌కి తొలి ముఖ్యమంత్రి కూడా.. అయితే, ఆయన పదవీకాలం కూడా పూర్తి చేయలేకపోయారు. అంతర్గత వ్యతిరేకతతో ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీని తరువాత, 18 మార్చి 2003న, బిజెపి రాష్ట్ర అధికారాన్ని అర్జున్‌ ముండాకు అప్పగించింది. 2005లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాలేదు.2005లో జార్ఖండ్‌ ముక్తి మోర్చాకు చెందిన శిబు సోరెన్‌ ఇక్కడ మొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అతను మెజారిటీని నిరూపించుకోలేకపోయాడు. ఆ తర్వాత బిజెపి నుంచి అర్జున్‌ ముండా రెండవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు అర్జున్‌ ముండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. మధు కోడా 18 సెప్టెంబర్‌ 2006న మొదటిసారిగా జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పదవీ కాలం రెండేళ్లు కూడా పూర్తి కానప్పటికీ, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2008 ఆగస్టు 28న శిబు సోరెన్‌ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ప్రభుత్వం కూడా ఆరు నెలల తర్వాత పడిపోయింది.జనవరి 19, 2009న మొదటిసారిగా జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో 2009లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పాత పరిస్థితి అలాగే ఉంది. ఇది 29 డిసెంబర్‌ 2009 వరకు కొనసాగింది. డిసెంబర్‌ 30న శిబు సోరెన్‌ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. కానీ ఈసారి మళ్లీ ఆరు నెలల పదవీకాలం కూడా పూర్తి చేయలేకపోయారు. మే 31న, శిబు సోరెన్‌ తన పదవికి రాజీనామా చేశాడు. జూన్‌ 1, 2010న జార్ఖండ్‌లో రెండవసారి రాష్ట్రపతి పాలన విధించబడిరది.జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన 10 సెప్టెంబర్‌ 2010న ముగిసి, బీజేపీకి చెందిన అర్జున్‌ ముండా మళ్లీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 2013 జనవరి 18న మళ్లీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 2013 జూలై 13న రాష్ట్రపతి పాలన ముగియడంతో హేమంత్‌ సోరెన్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పదవీకాలం డిసెంబర్‌ 23 వరకు కొనసాగింది. ఆ తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ కూటమికి పూర్తి మెజారిటీ లభించగా.. రాష్ట్రంలో తొలిసారిగా అదే ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగింది.రఘువర్‌ దాస్‌ జార్ఖండ్‌లో బిజెపి ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఆయన 28 డిసెంబర్‌ 2014 నుంచి 28 డిసెంబర్‌ 2019 వరకు పూర్తి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 2019 డిసెంబర్‌ 29న హేమంత్‌ సోరెన్‌ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. నుల విషయంలో హేమంత్‌ సోరెన్‌పై విమర్శల వెల్లువెత్తిన క్రమంలో హేమంత్‌ వ్యవహార సరళిపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్‌ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదును కేంద్రం ఎన్నికల సంఘానికి పంపడం, హేమంత్‌ శాసన సభ సభ్యత్వం రద్దుకు ఈసీ సిఫారసు చేయడం, ఈసీ సిఫారసు ఆధారంగా హేమంత్‌ ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకోవడం వేగంగా జరిగిపోయాయి. ఈ కీలక పరిణా మం తర్వాత తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్‌ సోరెన్‌ ఎలాంటి అడుగు వేస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.గనుల లీజు వ్యవహారంలో హేమంత్‌ సోరెన్‌ అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయనపై అనర్హత వేటు వేయా లని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్‌ రమేష్‌ బైస్‌ కి ఈసీ లేఖ రాసినట్లు రాజ్‌ భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. కానీ దీనిపై గవర్నర్‌ గానీ.. రాజ్‌భవన్‌ గానీ.. అధికారిక ప్రకటన చేయలేదు. షెల్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆస్తులు సంపాదించినట్లు సోరెన్‌ కుటుంబంపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 9ం నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది. చట్ట సభ్యుడిగా ఉన్నవారు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు పొందరాదని..దీన్ని ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని.. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే గవ్నరర్‌ ఈసీ అభిప్రాయాన్ని కోరగా.. ఈసీ తన స్పందన తెలియజేసింది. అనర్హతకు సిఫారసు చేసినట్లు సమాచారం.జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా కొత్త ముఖాన్ని అందుకోబోతున్నారని అంతా భావించే తరుణంలో రాష్ట్రంలో మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *