రంగంలోకి గేమ్‌ఛేంజర్‌

రామ్‌చరణ్‌ హీరోగా తమిళ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ఛేంజర్‌’. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక. ఇటీవలే యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ స్టూడియోలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు. అయితే ఈ చిత్రానికి లీకుల బెడద తప్పడం లేదు. రామ్‌చరణ్‌, కియారాపై బీచ్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా తీసిన ఫొటోలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్‌, ఎస్‌. జే సూర్య, అంజలి, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ చిత్రం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *