కేసీఆర్ పై వామపక్షాల ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 23
బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ మిత్ర ధర్మం మరిచి మోసం చేశారని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో రెండు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన తెలంగాణ సీపీఐ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాజకీయాలలో మోసం చేసే వారు, మోసపోయేవాళ్లు ఉంటారని వ్యాఖ్యానించారు . మునుగోడులో బీజేపీని ఓడిరచేందుకే తాము బీఆర్ఎస్కు మద్దతిచ్చామన్నారు. కలిసి ఉందామని కేసీఆర్ చెప్పారని, కానీ ఆ తర్వాత ఇప్పుడు లెక్క ఎందుకు మారిందో ఆయనే చెప్పాలన్నారు. మునుగోడులో మద్దతివ్వడం తమ తప్పు కాదన్నారు. కేసీఆర్ను తాము నమ్మడం కాదని, ఆయన తమను అవసరానికి వాడుకున్నారని తీవ్ర విమర్శలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పని చేద్దామని కేసీఆర్ తమతో రెండుమూడుసార్లు మాట్లాడారని, కానీ సీట్ల ప్రకటన సమయంలో తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. బిఆర్ ఎస్ తో పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని కమ్యూనిస్టు పార్టీల నేతలు చెబుతున్నారు. సీపీఎం, సీపీఐ.. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. తమతో ఎవరైనా కలిసి వస్తే పోటీకి సిద్ధమని..లేదంటే కమ్యూనిస్టు పార్టీలు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. వామపక్షాలకు సగంపైగా సీట్లలో ప్రభావం చూపే ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో కేసీఆర్ పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో కమ్యూనిస్టు నేతల్ని ప్రగతి భవన్కు పిలిపించి చర్చలు జరిపారు. కమ్యూనిస్టుపార్టీల జాతీయ నేతల్ని కూడా ప్రగతి భవన్కు పిలిచారు. జాతీయ రాజకీయాల్లోనూ కలిసి చేయాలని నిర్ణయించుకున్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో.. కమ్యూనిస్టులతో బంధం ఈ ఒక్క ఉపఎన్నికతో ఆగని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టుపార్టీ నేతలు కనీ సం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. మారిన రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు వద్దని కేసీఆర్ అనుకున్నారని జాబితాను బట్టి స్పష్టయింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్య అధినేత కేసీఆర్ నుంచి పిలుపును అందుకున్నారని గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందడం వెనుక సీపీఐ, సీపీఎం ఓట్లే కారణమన్న అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తన ఓటమికి ప్రధాన కారణం కమ్యూనిస్టులే అని బహిరంగంగా ప్రకటించారు. అయితే సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటే.. చెరో రెండు, మూడు సీట్లు అయినా ఇవ్వాల్సి వస్తుందని.. ఆ సీట్లు త్యాగం చేయడం కష్టమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ చేతిలో మోసపోయామని మండిపడుతున్నారు.
తామోంటో చూపిస్తామని సవాల్
తెలంగాణలో వామపక్ష పార్టీలు రగిలిపోతున్నాయి. కేసీఆర్ ఘోరంగా అవమానించారని .. వాడుకుని వదిలేశారని.. అమాయకంగా మోసపోయామని వారు భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్కు తామేంటో చూపించాలని అనుకుంటున్నారు. హైదరాబాద్లో రెండు వామపక్ష పార్టీలు సుదీర్ఘంగా చర్చించాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. బీఆర్ఎస్కు బుద్ది చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశాలపై చర్చించాలని నిర్ణయించారు. మునుగోడు ఉపఎన్నికల్లో మద్దతు కోసం ప్రగతి భవన్కు పిలిచి మరీ వామపక్ష నేతలకు మర్యాదలు చేసిన కేసీఆర్.. తర్వాత వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు పొత్తులు వద్దనుకున్నారు. మునుగోడు ఉపఎన్నికల తర్వాత ప్రగతి భవన్ గేట్లు కమ్యూనిస్టులకు ఓపెన్ కాలేదు. చాలా సార్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా వారికి అధినేత ఇవ్వలేదని సమాచారం. పొత్తులపై ఏదో ఒక్కటి తేల్చండి.. మా దారి మేము చూసుకుంటామని గత నెల నుంచి సీపీఐ, సీపీఎం నేతలు బహిరంగంగానే స్వరం పెంచారు. అప్పటికి వారికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ అన్ని అంశాలు బేరీజు వేసుకున్న తర్వాత చివరికి పొత్తు లేదని అన్ని స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా కేసీఆర్ తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో పోరాటం హోరాహోరీగా ఉంటందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో సీపీఐ, సీపీఎం పార్టీలకు నమ్మకమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒక్క సీటు కంటే ఎక్కువ దక్కించకోలేకపోయింది. దక్షిణ తెలంగాణలో తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపోటముల్ని తేలుస్తాయని నమ్ముతున్నారు. కానీ కేసీఆర్ కమ్యూనిస్టుల్ని వద్దనుకున్నారు. పొత్తుల సంగతి తర్వాత ముందు మన బలం పెంచుకుందామని రెండు వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగసభలతో బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని కమ్యూనిస్టులు నమ్ముతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడిరదని లెఫ్ట్ నేతలు అంచనాలు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలపై సీపీఐ గురిపెట్టింది. సీపీఏం సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పొత్తుల విషయం పక్కన పెట్టి వారికి పట్టు ఉన్నా ప్రాంతాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో సీపీఎం నాయకులు ఉన్నారు.కామ్రేడ్ల చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపునకు మళ్లినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు హస్తం పార్టీతో జతకట్టాలనిచూస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల సమయంలో కలసి రావాలని కాంగ్రెస్ కోరినా..బీజేపీని ఓడిరచాలంటే బీఆర్ఎస్ కే సాధ్యమని ప్రకటనలు చేసి.. బీఆర్ఎస్ తో వెళ్లారు. ఇప్పుడు రెండు వామపక్షాలు పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్ తో జతకట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనే అభిప్రాయాన్ని రెండుపార్టీల నేతలూ వ్యక్తం వచ్చారు. బీఆర్ఎస్ ను ఓడిరచడం కూడా తమ లక్ష్యాల్లో ఒకటిగా చేసుకున్నారు.