ఆగని వసూళ్ల దందా

మున్సిపాలిటీల్లో మళ్లీ వసూళ్ల దందా కొనసాగుతోంది. ఇంటి పర్మిషన్‌, బ్యాంక్‌ లోన్‌ ఇతర పనుల కోసం ప్రాపర్టీ టాక్స్‌ అసెస్‌ మెంట్‌?సర్టిఫికేట్స్‌ తప్పనిసరి కావడంతో మున్సిపాలిటీల్లో రివిజన్‌? నకళ్ల(అటెస్టెడ్‌? జిరాక్స్‌)? పేరిట డబ్బులు గుంజుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌? అసెస్మెంట్‌?నకళ్ల కోసం ఓ రేట్‌?ఫిక్స్‌? చేసుకొని వసూల్‌? చేస్తున్నారు. దీనికోసం మున్సిపాలిటీల్లో తీర్మానాలు చేయడం గమనార్హం. వెబ్‌ సైట్‌ అప్‌?డేట్‌.. సేవలు పాతవే మున్సిపల్‌ యాక్ట్‌ `2019 లో భాగంగా డీపీఎంఎస్‌ వెబ్‌ సైట్‌ ను క్లోజ్‌? చేసి సర్కార్‌? టీఎస్‌ బీపాస్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఈసీ, మార్కెట్‌ వాల్యూ, మాస్టర్‌ ప్లాన్‌, ప్రొహిబిషన్‌ లిస్ట్‌, నాలా వంటి వాటిని కమిషనర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) వెబ్‌ సైట్‌ అప్‌ డెట్‌ చేసింది. ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్‌ అసెస్‌ మెంట్లను కొత్తగా ఏర్పాటు చేసి టీఎస్‌?బీపాస్‌? వెబ్‌ సైట్‌ లో పొందుపరిచారు. వీటిని బుక్‌ లేట్‌ రూపంలోకి మార్చి స్టేట్‌ లోని అన్ని మున్సిపాలిటీలకు పేజీ నంబర్ల తో సహా అప్పగించారు. టీఎస్‌ బీపాస్‌ వెబ్‌ సైట్‌ లో ఇంటి పర్మిషన్‌ కోసం అప్లై చేస్తే 1985 కు చెందిన అసెస్‌ మెంట్‌(గ్రామ కంఠం, ఆబాది), ఎల్‌ఆర్‌ఎస్‌, నాన్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ కేటగిరీలు అడుగుతోంది. ఈ మేరకు అన్‌ లైన్‌ లో ఉన్న పీడీఎఫ్‌ కాపీ అప్‌ లోడ్‌ చేస్తే సరిపోతుంది. కానీ స్థానిక టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లు అప్లికేషన్‌ ను షార్ట్‌ లిస్ట్‌ కింద మ్యాన్‌ వల్‌ గా ప్రాపర్టీ టాక్స్‌ అసెస్మెంట్‌ కాపీలు జతచేయలేదని రిజెక్ట్‌ చేస్తున్నారు. మరో వైపు బ్యాంక్‌ లోన్‌ కోసం అసెస్మెంట్‌ కాపీలను అడగొద్దని మున్సిపల్‌ ఆఫీసర్లు బ్యాంకర్ల తో విూటింగ్‌ జరిపినా మ్యాన్‌ వల్‌?అసెస్‌?మెంట్‌? కాపీలు అడుగుతున్నారు. ఇలా చేయడం వల్ల వసూళ్ల పర్వం సాగుతోందని ప్రజలు అంటున్నారు. జగిత్యాల మున్సిపల్‌ పరిధిలో ప్రాపర్టీ టాక్స్‌ అసెస్మెంట్‌ రివిజన్‌ ధరఖాస్తు దారుల నుంచి ఇంటి స్థలాన్ని బట్టి 100 గజాలు, ఆపై వాటికి రూ. వెయ్యి, 200 గజాలు, ఆపై రూ. 3 వేలు, 300 గజాలు, ఆపై వాటికి రూ. 5 వేలు వసూల్‌ చేస్తున్నారు. అదే కమర్షియల్‌ బిల్డింగ్‌ అయితే 100 గజాలకు రూ. 3 వేలు, 200 గజాలకు రూ. 5 వేలు వసూల్‌ చేస్తున్నారు. కోరుట్ల పరిధిలో ఇంటికి ఒక ఏడాది అసెస్మెంట్‌ కాపీకి రూ.500 , ఓనర్‌ కాకుండా థర్డ్‌ పార్టీకి రూ. వెయ్యి వసూలు చేస్తున్నారు. మెట్‌ పల్లిలో రివిజన్‌ అసెస్మెంట్‌ కోసం రూ. 2వేలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో టౌన్‌ ప్లానింగ్‌, బ్యాంకర్లు తప్పనిసరిగా మ్యాన్‌ వల్‌?ఇవ్వాలని పట్టణ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరోవైపు ఎలాంటి మ్యాన్‌ వల్‌?సర్టిఫికేట్లు ఇవ్వకూడదని ఉన్నతాధికారులు సర్క్యులర్లు ఇచ్చినా పాలకవర్గాలు, కింది స్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *