అవిూర్‌ ఖాన్‌ బాలీవుడ్‌ కు బైబై..?

ఇటీవల కాలంలో బాలీవుడ్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. సౌత్‌ సినిమాలు పాన్‌ ఇండియా హిట్స్‌ గా నిలుస్తుంటే హిందీ సినిమాలు మాత్రం కనీసం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనిలేకుండా వరుసగా అక్కడ సినిమాలన్నీ డిజాస్టర్స్‌ గా నిలుస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా తప్ప అక్కడ చెప్పుకోదగ్గ సినిమా లేదు.ఇదిలా ఉంటే స్టార్‌ హీరో అవిూర్‌ ఖాన్‌ అయినా బాలీవుడ్‌ ను ఆదుకుంటాడేమో అని ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ అది కూడా నిరాశనే మిగిల్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్‌ సింగ్‌ చడ్డా సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. అవిూర్‌ ఖాన్‌ నటించిన ఈ సినిమాలో కరీనా కపూర్‌ హీరోయిన్‌ గా నటించారు. అలాగే టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.అయితే ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. గతంలో అవిూర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలే ఈ సినిమాకు మైనస్‌ అయ్యాయని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా లాల్‌ సింగ్‌ చడ్డా ఫ్లాప్‌ అవ్వడంతో నిర్మాత దారుణంగా నష్టపోయారని తెలుస్తోంది. కనీసం 50 కోట్ల వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. దాంతో నిర్మాతలకు నష్టాలు మిగిలాయని వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించారు చిత్రనిర్మాతలు అలాంటిదేమి లేదని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే అవిూర్‌ ఖాన్‌ ఈ సినిమాకోసం తీసుకున్న రెమ్యునరేషన్‌ 50 కోట్లు కూడా తిరిగి ఇచ్చేశారని టాక్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో మరో వార్త ఇప్పుడు అందరిని షాక్‌ కు గురి చేస్తోంది. ఇక పై అవిూర్‌ ఖాన్‌ సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నారట. ఇక పై తాను హీరోగా సినిమాలు మానేయాలని అనుకుంటున్నట్టు ఓ వార్త ఇప్పుడు బీ టౌన్‌ లో చక్కర్లు కొడుతోంది. లాల్‌ సింగ్‌ ఎఫెక్ట్‌ కారణంగా అవిూర్‌ ఈ కీలక నిర్ణయానికి వచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హీరోగా సినిమాలు ఆపేసి.. నిర్మాతగా సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్నారట అవిూర్‌ . మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *