సచివాలయ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన సిబ్బందికి పొబ్రేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్‌ వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది.ప్రొబేషన్‌ ద్వారా సచివాలయ ఉద్యోగాలకు భద్రత ఏర్పడినట్టయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే సచివాలయ సిబ్బంది నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించే ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది.గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్‌ ఖరారైన గ్రేడ్‌?5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీల పే?స్కేలును రూ.23,120 ? 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడిరచాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే?స్కేలును రూ. 22,460? 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది.నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి, డిపారెంట్‌ టెస్టు ఉత్తీర్ణత, ఎటువంటి నేర చరిత్ర లేదన్న పోలీసు రిపోర్టులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్‌ ఖరారుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి ఆయా జిల్లాల్లో కేటగిరీ వారిగా అర్హుల పేర్లతో కూడిన జాబితాలతో వేర్వేరుగా ప్రోసీడిరగ్స్‌ జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *