షుగర్‌ పేషంట్లకు టీటీడీ లడ్డూలు

భక్తులను కాపాడే ఆ దేవుడినే కొందరు అక్రమ సంపాదన కోసం వినియోగించుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే కొలువై ఉన్న తిరుమలలోనే భక్తులు మోసపోతున్నారు. భక్తుల విశ్వాసాలను ఆసరాగా చేసుకుని దళారులకు తోడుగా మోసగాళ్లు ఇబ్బడిముబ్బడిగా దోచుకుంటున్నారు. శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసగిస్తూ నకిలీ వెబ్‌ సైట్లు ఎన్నో పుట్టుకొచ్చాయి. దర్శనం టికెట్‌ పేరుతో భక్తుల్ని నిండా ముంచుతున్నారు అలాంటి నకిలీ వెబ్‌సైట్‌ నిర్వాహకులు, సిబ్బంది. ఈ క్రమంలోనే మరో ఫేక్‌ న్యూస్‌ సోషల్‌ విూడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సారి ఏకంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరుపై ఓ ఫేక్‌ న్యూస్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.తిరుపతి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఇన్‌చార్జి) ధర్మారెడ్డి భక్తుల సమస్యలను ఫోన్‌లో విన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రా రాష్ట్రం గుంటూరుకు చెందిన దశరథ రామయ్య అనే భక్తుడు మాట్లాడుతూ? తిరుపతి లడ్డూ ప్రసాదంలో చక్కెర కాస్త ఎక్కువగా ఉందని, నాలాంటి మధుమేహ రోగులకు అనుకూలంగా లడ్డూ ప్రసాదం అందజేస్తే బాగుంటుందని అభ్యర్థించారు. అలాగే డయాబెటిక్‌ పేషెంట్లకు ప్రత్యేకంగా లడ్డూ తయారీ, సరఫరాపై నిర్ణయం తీసుకుంటామని అధికారి ధర్మారెడ్డి సమాధానమిచ్చారు. దీంతో డయాబెటిక్‌ పేషెంట్ల కోసం తీయని లడ్డూను తయారు చేసి అందిస్తున్నట్లు సోషల్‌ విూడియాలో వార్తలు వేగంగా వ్యాపించాయిఅయితే ఈ సమాచారం సరికాదని, దీనిపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. సంతృప్తి చెందిన లడ్డూ పేటెంట్‌ పొందిందని, షుగర్‌ ఫ్రీ లడ్డూను అందించడం పేటెంట్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తుందని కూడా నివేదించబడిరది. అలాగే డయాబెటిక్‌ పేషెంట్ల డిమాండ్‌ మేరకు షుగర్‌ ఫ్రీ లడ్డూ అందజేస్తే.. మరికొందరు భక్తులు మరేదైనా కారణంతో మరికొంతమంది ప్రసాదం కావాలని కోరతారని దేవస్థానం వివరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *