నేడు మంథని డిపోలో డయల్ యువర్ డిఎం మంథని
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంథని డిపో పరిధిలో మంగళవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంథని బస్సు డిపో మేనేజర్ టి. శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 11గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. 9959225923 నెంబర్ ద్వారా మంథని డిపో పరిధిలో ఉన్న సమస్యలను మాకు ఫోన్ చేసి చెప్పాలని అలాగే సలహాలు, సూచనలు అందజేయాలన్నారు.ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని డిఎం కోరారు.