ఈ సారి బరిలోకి జానారెడ్డి వారసులు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎల్పీ లీడర్‌ కుందూరు జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తన ఇద్దరు కొడుకులకు రాజకీయంగా లైన్‌ క్లియర్‌ చేసేందుకు ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. నల్గొండలో శుక్రవారం విూడియా చిట్‌ చాట్‌ లో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రసక్తే లేదని, పరిస్థితులు సహరిస్తే సీఎం పదవి వదులుకోనని తేల్చిచెప్పారు. 70 ఏండ్ల వయసున్న జానారెడ్డి ఇటీవల కొంత అనారోగ్యానికి గురయ్యారు. తన కొడుకులను బరిలోకి దింపడానికి ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని ఆయన కొడుకులు జయవీర్‌ రెడ్డి, రఘువీర్‌ రెడ్డి ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. ఈ విషయంలో జానారెడ్డిపై కొడుకుల నుంచి ఒత్తిడి కూడా ఉందని అంటున్నారు. ఇటీవల నాగార్జునసాగర్‌?కు చెందిన ముఖ్యనేతలతో జరిగిన భేటీలో వచ్చే ఎన్నికల్లో జయవీర్‌, రఘువీర్‌ పోటీ చేస్తారని జానారెడ్డి చెప్పినట్టు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి అనేక పదవులు నిర్వహించారు. 2014 లో కాంగ్రెస్‌ పవర్‌ లోకి వస్తే ఆయన సీఎం అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్‌ కూడా అధికారంలోకి రాలేకపోయింది.2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్‌?లో జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది. 2021 ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పుడే రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించారు. కానీ, రేవంత్‌ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టడంతో ఆయన పార్టీలో యాక్టివ్‌ అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌ గ్రూపులను సమన్వయం చేయడంలో జానారెడ్డి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయంలో తన వారసులను బరిలో దింపేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డిల మధ్య సీట్లకు సంబంధించి సయోధ్య కుదిరితే జయవీర్‌, రఘువీర్‌ లకు అవకాశం దొరకవచ్చునని అంటున్నారు. బీఆర్‌ ఎస్‌, సీపీఎం మధ్య పొత్తు ఉండీ.. మిర్యాలగూడను సీపీఎంకు వదిలితే రఘువీం అక్కడ నుంచి పోటీ చేయడం ఖాయమని పార్టీ సీనియర్లు అంటున్నారు. జయవీర్‌ రెడ్డి మాత్రం నాగార్జునసాగర్‌ నుంచే బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఉప ఎన్నికల నాటి నుంచే జయవీర్‌ సాగర్‌ లో పార్టీ లీడర్లు, ప్రజలతో టచ్‌ లో ఉంటున్నారు. రఘువీర్‌ రెడ్డి మిర్యాలగూడలో క్యాంప్‌ ఆఫీసు ఓపెన్‌ చేశారు. మిర్యాలగూడలో జరిగే అన్ని కార్యక్రమాల్లో తండ్రితో కలిసి పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయను, పార్టీ హైకమాండ్‌ ఆఫర్‌ చేస్తే సీఎం పదవి స్వీకరిస్తానని జానారెడ్డి విూడియా చిట్‌ చాట్‌ లో తెలిపారు. సీఎం అయితే తన కొడుకు గెలిచిన స్థానం నుంచి రాజీనామా చేయించి తాను పోటీ చేస్తానన్నారు. అవసరమై తే ఉత్తమ్‌ తన కోసం ఎమ్మెల్యే పదవి వదులుకుంటాడని చెప్పగా.. ఉత్తమ్‌ కూడా అంగీకారం తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *