తెలంగాణలో మోదీ సుడిగాలి పర్యటన.. నైట్ రాజ్‌భవన్‌లో బస

హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు కామారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఎన్నికల సభల్లో మోదీ పాల్గొంటారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్ రాజ్‌భవన్‌లో (Hyderabad Rajbhavan) మోదీ బస చేయనున్నారు. రేపు (ఆదిలాబాద్) దుబ్బాక, నిర్మల్‌లో మోదీ పబ్లిక్ మీటింగ్స్‌కు హాజరుకానున్నారు. రేపు సాయంత్రం తిరుపతి వెళ్ళనున్న ప్రధానమంత్రి.. రాత్రికి తిరుమలలో (Tirumala) బస చేయనున్నారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం తిరుమలలో మోదీ శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు.

అనంతరం తిరుపతి నుంచి నేరుగా మహబూబాబాద్‌‌కు ప్రధానమంత్రి వెళ్లనున్నారు. మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. ఎల్లుండి (నవంబర్సా 27) యంత్రం హైదరాబాద్ మోదీ రోడ్డు షో ఉండనునుంది. మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి మోదీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు కామారెడ్డి సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:05 గంటలకు మహేశ్వరం సభకు నరేంద్రమోదీ వెళ్లనున్నారు. సభ తర్వాత మహేశ్వరం నుంచి 7 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోదీ వెళతారు. రోడ్డు మార్గాన రాజ్‌భవన్‌కు ప్రధానమంత్రి మోదీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *