హ్యాట్రిక్ కోసం..కసరత్తులు
ఎన్నికలు సవిూపిస్తుండగా సర్కార్ అలర్టైంది. బీఆర్ఎస్(టీఆర్ఎస్)హ్యాట్రిక్ కొట్టాలని పావులు కదుపుతున్నది. మెజార్టీ ప్రజల మైండ్ ను మార్చి ఓట్లు రాల్చుకోవాలని వ్యూహాలు పన్నుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినోళ్లను టార్గెట్ చేసింది. ఓటర్ లిస్టును పరిశీలిస్తూ సర్కార్ నుంచి స్కీమ్ లు పొందిన లబ్ధిదారుల వివరాలను గుర్తించనుంది. ఏ స్కీమ్ నుంచి లబ్ధిపొందారు? ప్రభుత్వంపై వాళ్లకు ఉన్న ఆలోచన ఏమిట ి? ఆ ఇంట్లో ఓటర్లు ఎందరు ఉన్నారు? వంటి వివరాలన్నింటినీ సేకరించనుంది.ఇప్పటికే బీఆర్ఎస్ హై కమాండ్ నుంచి క్షేత్రస్థాయి లీడర్లకు ఆదేశాలు అందాయి. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా కమిటీలు వేయనుంది. ఇవి అన్ని స్కీముల లబ్ధిదారుల వివరాలు సేకరిస్తాయి. ఇప్పటికే వెల్ఫేర్, ఇతర డిపారెంట్ల ఆఫీసర్లకు డేటా అంశంపై సర్కార్ అంతర్గతంగా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తున్నది. ప్రతి బెనిఫియర్ సామాజికవర్గం, ఫోన్ నంబర్లతో సహా రిపోర్టులు తయారు చేయనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ తెలిపారు.బెనిఫియర్లపై మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయనున్నది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ కు ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో కేడర్ కోరనున్నది. ఈసారి గెలిస్తే విూకు మరింత మేలు జరుగుతుందని.. స్కీమ్ లబ్ధిదారులకు సూచించనున్నారు. అవసరమైన పార్టీ పెద్దల నుంచి కూడా బెనిఫియర్లకు ఫోన్లు చేపించాలని పార్టీ ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా జిల్లాకో టెలీ యూనిట్ టీమ్ లను ఎన్నికల కొరకు వాడనున్నారు. బీఆర్ఎస్ ఆఫీసులో వీళ్లకు ట్రైనింగ్ తో పాటు టాస్క్ నిమిత్తం ప్రత్యేక సౌకర్యాలను కూడా కల్పించనున్నారుప్రభుత్వం నుంచి లబ్ధిపొందినోళ్లు తప్పనిసరిగా బీఆర్ఎస్ కు ఓటు వేస్తారనే భావనలో ప్రభుత్వం ఉన్నది. సాయం పొందినోళ్లు సర్కార్ కు అండగానే ఉంటారని ప్రభుత్వం ఫీల్ అవుతున్నది. అయితే పార్టీ నుంచి పదే పదే గుర్తు చేయడంతో బీఆర్ఎస్ గుర్తును మరిచిపోరనే భ్రమలో బీఆర్ఎస్ హై కమాండ్ ఆలోచిస్తున్నది. కల్యాణలక్ష్మి, ఆసరా, ఎంపర్మెంట్, తదితర స్కీమ్లు లబ్ధిదారులకు సర్కార్ నేరుగా ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు యువత, నిరుద్యోగులను ఆకర్షించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు బీఆర్ఎస్ ఇన్ చార్జి ఒకరు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అరవైకి పైగా సీట్లు సాధించగా, రెండో విడత ఎనభై కి పైగా.. మూడోసారి వంద సీట్లు టార్గెట్ గా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతున్నది. అయితే ప్రభుత్వం వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.