విశేషంగా అమ్మవారి గజవాహన సేవ

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టి.నగర్‌ వెంకటనారాయణరోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయం(Venkateswara Swamy Temple)లో నిర్వహిస్తున్న పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం అమ్మవారు గజవాహనంపై ఊరేగారు. ఆలయ మాడవీధుల్లో ఈ ఊరేగింపు కొనసాగింది. ఈ సందర్భంగా రోడ్డుకిరువైపులా భక్తులు బారులుదీరి విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించి పులకించిపోయారు. కొంతమంది తమ ఇళ్ల ముందు ముగ్గులేసి అమ్మవారిని భక్తిప్రపత్తులతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చెన్నై సమాచారకేంద్ర సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ దంపతులు, ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సభ్యులు ఆనందకుమార్‌రెడ్డి, పీవీఆర్‌ కృష్ణారావు, మోహన్‌రావు, కార్తికేయన్‌, ధీరజ్‌రెడ్డి, మాజీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *