ప్రెస్టేజియస్‌ గా… జగనన్నకు చెబుదాం…

ఆంధ్రప్రదేశ్‌లో మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. దీని కోసం 1902 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను వినియోగంలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, జగనన్నకు చెబుదాం మే 9న ప్రారంభించనున్నట్లు సిఎం ప్రకటించారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సవిూక్షలు చేశామని సిఎం పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి తన పేరును కలిపారని, దానిని బట్టే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతో ఇట్టే అర్థం అవుతుందన్నారు.ఇప్పటికే స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం అన్నారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం ఉద్దేశమన్నారు. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే కార్యక్రమ ఉద్దేశం అన్నారు. హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే, దానిని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని సిఎం సూచించారు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయని తెలిపారు. ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేయాలన్నారు.
గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలన్నారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యపడుతుందని చెప్పారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుందన్నారు. హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్‌ వస్తాయని, వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది ముఖ్యమైన విషయం అన్నారు. వ్యక్తిగత ఫిర్యాదులు, కుటుంబం స్థాయిలో వచ్చే ఫిర్యాదులను నమోదు చేసిన తర్వాత వాటిని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలన్నారు.ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ చేస్తారని, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉంటారని, వారి ఫిర్యాదులను నేరుగా తెలియచేయ వచ్చన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుందన్నారు.
ఐవీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్‌ అప్‌డేట్స్‌ అందుతాయన్నారు. హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుందని, గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారన్నారు. హెల్ప్‌లైన్‌ను ప్రజలు అంతా వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారని తెలిపారు.జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయని, సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయన్నారు. ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ప్రత్యేకాధికారులుగా ఉంటారని తెలిపారు. క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారన్నారు. ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారని, కలెక్టర్లతో కలిపి? జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారన్నారు. సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారని, ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారన్నారు.ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి లేకపోతే, దాన్ని తిరిగి ఓపెన్‌ చేస్తారన్నారు. ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారని, పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సవిూక్ష చేస్తారన్నారు. చీఫ్‌ సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారని, ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సవిూక్ష ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగారి పేరు పెట్టారంటే మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పేరు పెట్టినట్టేనని సిఎం తెలిపారు.అధికారుల విూద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులను నిర్వహిస్తాడని, అధికారులు అంత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే? కార్యక్రమం సమర్థవంతంగా సాగుతున్నట్టే లెక్క అని చెప్పారు. ప్రజలకు నాణ్యంగా సేవలను అదించాలన్నదే దీని ఉద్దేశమన్నారు. జగనన్నకు చెబుదాం అమలుకు ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుందని, అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చన్నారు. వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంలో డెలవరీ మెకానిజం ఉంటుందన్నారు.గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్‌.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారని, ఇవి సక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *