డిజిటల్ కరెన్సీ అడుగులు..
డిజిటల్ రూపాయి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఆధునాత సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. నగదుకు బదులు డిజిటల్ కరెన్సీని వినియోగించే ట్రెండ్ దేశంలో మరింతగా పెరిగిపోతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే, మన ఇండియాలో క్రిప్టోకరెన్సీని ఉపయోగించే విధానం పెరిగిపోతోంది. అయితే నగదు కరెన్సీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. కొన్ని నష్టాలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ నేరాలతో పాటు రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా దేశీయ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చింది. రిజర్వ్ బ్యాంక్ భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్ను గత ఏడాదిలోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని కూడా పిలువబడే డిజిటల్ రూపాయి ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం.. డిజిటల్ కరెన్సీ వినియోగం వాణిజ్యంలో పెను మార్పులకు దారి తీస్తుంది. ఈ నాణేలపై ప్రభుత్వ ముద్ర ఉండడంతో ఆర్థిక మోసం, నష్టం జరిగే అవకాశం ఉండదు. ప్రస్తుతం పెరుగుతున్న ఆన్లైన్ మోసాలను దృష్టిలో ఉంచుకుని ఈ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఆర్బీఐ.డిజిటల్ రూపాయి కోసం ఇప్పటికే తొమ్మిది బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫాస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంకులు ఉన్నాయి. ఈ విధానానం మరింతగా విస్తరించేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. డిజిటల్ రూపాయిని ప్రారంభించడంలో కొన్ని సాంకేతిక, విధానపరమైన సమస్యలను గుర్తించి అన్ని సమస్యలను తొలగించి ఎలాంటి అడ్డంకులు లేని విధంగా సీబీడీసీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడంతోపాటు భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా రిజర్వ్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ దానికి ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న వర్చువల్ కరెన్సీ. ఇ`రూపాయి డబ్బు లావాదేవీ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈ విధానం పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే నోట్ల ప్రింటింగ్ విషయంలో కూడా ఖర్చు మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ఎక్స్ఛేంజ్ సాధ్యమవుతుంది. ఎటువంటి అదనపు లావాదేవీ రుసుము లేకుండా అన్ని చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంటోంది. అయితే ఈ`రూపాయిలు నిజమైన కరెన్సీకి సమానం. అందుకే కాగితం నోట్లకు బదులుగా ఈ కరెన్సీ కూడా ఉపయోగించబడుతుంది. యూపీఐ ద్వారా లావాదేవీలకు వినియోగదారుకు బ్యాంక్ అకౌంట్ అవసరం. డిజిటల్ కరెన్సీలకు ఎలాంటి బ్యాంకు అకౌంట్ అవసరం ఉండదు. అలాగే డిజిటల్ కరెన్సీలకు ఎలాంటి గడువు అనేది ఉండదు. ఈ డిజిటల్ కరెన్సీని జీవితాంతం ఉపయోగించుకోవచ్చు. మరో వైపు జర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేపట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా కెనరా బ్యాంక్ ‘కెనరా డిజిటల్ రూపీ యాప్’ పేరిట ఒక యూపీఐ ఇంటరాపబుల్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ప్రభుత్వ రంగ ` ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఈ విధంగా డిజిటల్ కరెన్సీకి మొబైల్ యాప్ తీసుకొచ్చిన తొలి బ్యాంక్ ఇదే. ఈ యూపీఐ ఇంటరాపబులిటీ అనేది భారత ఆర్థిక వ్యవస్థను డిజిటైజేషన్ చేయడంలో ఒక విప్లవాత్మక అడుగు అని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ కె. సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. వినియోగదార్లు మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్లను, కెనరా డిజిటల్ రూపీ యాప్తో స్కాన్ చేయొచ్చు. తద్వారా డిజిటల్ కరెన్సీలో చెల్లింపులు చేయొచ్చు. ఈ ఫీచరు ప్రస్తుత యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారానే పనిచేస్తుంది. అంటే సీబీడీసీకి విడిగా క్యూఆర్ కోడ్ల అవసరం ఉండదు.అనుసంధానమై ఉన్న ఖాతా నుంచి సీబీడీసీ వాలెట్లోకి కరెన్సీని లోడ్ చేయాలి.
సీబీడీసీ వాలెట్ ఉన్న ఏ వ్యక్తికైనా డిజిటల్ కరెన్సీని బదిలీ చేయొచ్చు. సీబీడీసీ క్యూఆర్ ఆధారిత చెల్లింపులను ఎవరికైనా చేయొచ్చు. ఎవరి నుంచైనా పొందొచ్చు.వ్యాపారులకు సైతం యూపీఐ లేదా సీబీడీసీ క్యూఆర్ ఆధారిత చెల్లింపులు చేయొచ్చు.అవసరం అనుకుంటే డిజిటల్ కరెన్సీని తిరిగి అనుసంధానం చేసి ఉన్న ఖాతాకు క్రెడిట్ చేసుకోవచ్చు.అలాగే, డిజిటల్ కరెన్సీ వల్ల ఏ విధంగాను మోసపోయే అవకాశం ఉండదు. బిట్ కాయిన్ వంటి కరెన్సీలలో ఈ`రూపాయిలు ఆర్థిక ప్రమాదానికి అవకాశం లేదు. ఈ`రూపాయిల వినియోగం వల్ల ప్రభుత్వానికి కూడా చాలా డబ్బు ఆదా అవుతుంది. ఎందుకంటే కాగితపు నోట్ల విషయంలో ముద్రణ, పంపిణీ, నిల్వకు ఎటువంటి ఖర్చు ఉండదు. కాగితంపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల పర్యావరణం కూడా ఆదా అవుతుంది.