డిసెంబర్‌ లో ఏపీ ఎన్నికలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అంతకన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సాధారణంగా డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈసారి అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల విషయమై ఇటీవలే ఎలక్షన్‌ కమిషన్‌ బృందం తెలంగాణలో మూడురోజులు పర్యటించి, ఉన్నత అధికారులతో వరుస భేటీలు నిర్వహించింది. రాష్ట్రంలో పర్యటించిన బృందంలో సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్ర శర్మ, ఆర్‌ కే గుప్తా, సంజయ్‌ కుమార్‌, అండర్‌ సెక్రటరీ అవినాశ్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ హిర్దేశ్‌ కుమార్‌, ఇతర డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, కలెక్టర్లు, ఐటీ, పోలీసు ఉన్నత అధికారులతో రెండురోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించింది. సమయం ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్‌ 7 లోపే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని ఈసీ పరోక్షంగా సంకేతాలిచ్చింది. అధికారులు కూడా అదే జరగవచ్చని చెబుతున్నారు. ఈసీ కొత్తగా తీసుకు వచ్చిన సాంకేతికత, కొత్త అప్లికేషన్ల వాడకంపై అవగాహనతో పాటు.. ఓటర్‌ జాబితా, నోటిఫికేషన్‌, ఎన్నికల కోడ్‌ అమలు, పోలీస్‌ చెకింగ్‌ పాయింట్ల ఏర్పాటు, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో ఈసీ బృందం చర్చించింది. ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అధికారులను త్వరగా బదిలీ చేయాలని కూడా ఈసీ బృందం ఆదేశించినట్లు సమాచారం.
చెరో దారిలో బీజేపీ, జనసేన
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతలు, జనసేన నేతలకు పొత్తులపై క్లారిటీ లేదనే చర్చ సాగుతోంది. కలిసి పోటీ చేస్తామని చెబుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. పైగా టీడీపీ, జనసేన నేతలు వచ్చే ఎన్నికల్లో తమకే మెజారిటీ వస్తాయని చెప్పుకుంటున్నారు. దీంతో ఆయా పార్టీల కేడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. చంద్రబాబు నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తమ పార్టీకి 160 సీట్లకు తగ్గకుండా వస్తాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో పొత్తు సాధ్యమేనా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పొత్తు కుదిరితే చంద్రబాబు నాయుడు సీఎం పదవి చేపట్టాలి. సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని ఆయన ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల జరిగిన మహానాడులో ఆయన ఇదే విషయాన్ని ప్రకటించారు. కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థి, అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే జనసేన నుంచి విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌.. తాను ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. పొత్తు ఉంటే సీఎం పదవి పంచుకోవాలి. అయితే రెండు పార్టీల్లోని సందేహాలు వెలుగులోకి వచ్చినా అందుకు విరుద్ధంగా ప్రకటనలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇప్పటికిప్పుడే పొత్తు ప్రకటిస్తే క్యాడర్‌లో గందరగోళం నెలకొంటుందని ఇరు పార్టీలు ఆందోళనకు గురవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పట్లో పొత్తు లేకపోయినా.. ఎన్నికల ముందు చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అది సాధ్యం కాకపోతే, పార్టీలు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి, తమకు వచ్చిన సీట్ల ఆధారంగా అధికారాన్ని పంచుకోవచ్చు. ప్రజల మూడ్‌ని బట్టి రెండు పార్టీలు దీనిపై నిర్ణయం తీసుకుంటాయని అంటున్నారు పరిశీలకులు. అప్పటి వరకు ప్రశ్నలు, గందరగోళం మామూలే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *