50 రోజులలోదొరికిన మూడు చిరుతలు

తిరుమల, ఆగస్టు 17
తిరుమలలో నడక మార్గంలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. గత వారం తిరుమల మెట్ల మార్గంలో తల్లిదండ్రులతో కలిసి వెళుతున్న లక్షిత అనే చిన్నారిని చిరుత చంపేసింది. దీంతో టీటీడీ ఆపరేషన్‌ చిరుత పేరుతో చిరుతల్ని బంధించే కార్యక్రమాన్ని చేపట్టింది.తిరుమలలో చిరుతల సంచారంతో గత కొన్ని రోజుల నుంచి భయాందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుమలలో బోనులో మరో చిరుత చిక్కింది. ఇటీవల ఓ చిరుత చిక్కగా.. తాజాగా, గురువారం ఉదయం మరో చిరుత బోనులో చిక్కింది. నామాలగవి దగ్గర చిరుతను అధికారులు బంధించారు. రెండు నెలల్లో మూడు చిరుతలను ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్నారు. 4 రోజుల కింద ఒకటి.. ఇవాళ మరో చిరుత చిక్కడంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ.. ఇంకా 2`3 చిరుతలు నడకమార్గంలో సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.4 రోజుల కిందట నరసింహస్వామి ఆలయం దగ్గర్లోనే ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కింది. మిగతా వాటిని కూడా బంధించి మరోచోట వదిలిపెట్టేందుకు ఆపరేషన్‌ చిరుత కొనసాగించారు.. ఈ క్రమంలోనే 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేస్తే ఇవాళ మళ్లీ ఓ చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపారు. అధికారులు మొత్తం 3 చోట్ల ట్రాప్‌లు పెట్టగా.. నరసింహస్వామి ఆలయ సవిూపంలో ఒకటి ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట దగ్గర మరో ట్రాప్‌, మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు దగ్గర కూడా ఒక బోన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్‌ సత్ఫలితాన్నిచ్చి మరో చిరుత చిక్కింది. తిరుమల అలిపిరి మార్గంలో 7వ మైలు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సవిూపంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితను చిరుత బలితీసుకుంది. దీంతో అలర్టయిన తిరుమల తిరుపతి దేవస్థానం.. మెట్ల మార్గంలో ఆంక్షలను కూడా విధించింది. చిన్నారులకు మధ్యాహ్నం నుంచి మెట్ల మార్గంలో ప్రవేశాన్ని నిషేధించింది. అంతేకాకుండా భక్తులకు కర్రలను కూడా అందజేస్తోంది. అయితే, చిన్నారి ఘటన తరువాత తిరుమలకొండపై ఓ చిరుత బోనుకు చిక్కగా.. నామాలగవి ప్రాంతంలో మరో చిరుత సంచరించడం, ఈ క్రమంలోనే మెట్ల మార్గంలో ఎలుగుబంటి కనపడటం కలకలం రేపింది.దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తుల రక్షణ కోసం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. సిబ్బందిని మోహరించడంతోపాటు, భక్తులకు కర్రలు పంపిణీ చేయడం, చిరుతలను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.ఇటీవల బోనులో చిక్కిన చిరుత.. కాగా దొరికిన చిరుతల్లో చిన్నారిని చంపేసినది ఏది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. సోమవారం బోనులో పడిన చిరుత ఐదారేళ్ల వయసు ఉంటుందంటున్నారు. గురువారం దొరికింది కూడా పెద్దదే అంటున్నారు. ఈ చిరుతను కూడా తిరుపతిలోని ూప జూకి తీసుకువెళ్తారు. ఈలోపు చిరుతల పాదముద్రలు.. మిగతా రిపోర్టుల ఆధారంగా పాపను చంపింది ఏది అనేది తేలుస్తారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *