బాస్‌ని కలిసిన ప్రతిసారీ ప్రత్యేకమే!

టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్‌ (Devisri prasad) ఒకరు. తన సంగీతంతో రాక్‌స్టార్‌గా, మ్యూజిక్‌ మిసైల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు మెగాస్టార్‌ చిరంజీవి (megastar chiranjeevi) అంటే ఎనలేని ప్రేమ, అభిమానం. సందర్భం దొరికిన ప్రతిసారీ ఆ విషయాన్ని వెల్లడిస్తుంటారు. చిన్నతనంలో చిరు గిఫ్ట్‌గా ఇచ్చిన వాచ్‌ గురించి ఇప్పటికీ దేవీ గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఇటీవల చిరంజీవిని కలిశారు. ఉదయాన్నే చిరుని కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఫొటో షేర్‌ చేశాడు. సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు
బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్‌. అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ మేము చాలా ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకు ఎప్పుడూ చాలా చాలా ప్రత్యేకం. లవ్‌ యూ సార్‌’’ అని ఫోస్ట్‌ చేశారు. ఫొటో తీసిన కొణిదెల సుస్మితకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలుసుకోవడం వెనుకున్న సీక్రెట్‌ ఏంటని నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. పూనకాలు లోడింగ్‌ అంటూ ‘వాల్తేరు వీరయ్య’ అద్భుతమైన బాణీలు ఇచ్చిన డీఎస్పీ తదుపరి చిత్రం సిట్టింగ్స్‌లో భాగంగా కలిశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి ప్రస్తుతం మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్‌’ సినిమాలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ పవన్‌కల్యాణ్‌ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, ‘పుష్ప.. ది రూల్‌’కు సంగితం అందిస్తున్నారు.

ఇటీవల దేవిశ్రీ ప్రసాద్‌ పెళ్లిపై రూమర్లు వచ్చిన సంగతి తెలిసింది. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.. అంటూ వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. అయితే దానిపై డీఎస్‌పి ఎక్కడా స్పందించలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *