కృష్ణావర్శిటీలో ఈ?బుక్స్‌

రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతతో విద్య, అభ్యసన వ్యవస్థల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కోవిడ్‌ తర్వాత ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలకు వరకూ అంతా డిజిటల్‌ పాఠానికి అలవాటు పడ్డారు. అందుకు తగ్గట్లుగా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు అందరికీ ఉపయోగపడేలా కృష్ణా యూనివర్సిటీ అధికారులు ఈ?విజ్ఞాన భాండాగారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.వర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ పేరిట అత్యాధునిక సౌకర్యాలతో డిజిటల్‌ లైబ్రరీని గత విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. తద్వారా డిగ్రీ, పీజీ పట్టాలతో బయటకు వెళ్లే విద్యార్థులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా సాంకేతికతతో కూడిన విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అవకాశం కలి?పంచారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, వివిధ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు అభ్యసించే సుమారు వెయ్యి మంది విద్యార్థులు సెంట్రల్‌ లైబ్రరీ సద్వినియోగం చేసుకుంటున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వర్సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో సాంకేతికతను జోడిరచారు. చదువుతున్న కోర్సులకు రిఫరెన్స్‌గా సుమారు ఒక లక్షకు పైగా ఈ?బుక్స్‌ అందుబాటులో ఉంచారు. కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు వీటిని వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేశారు. ఒకే సారి వందమంది విద్యార్థులు లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకునేలా సీటింగ్‌ సమకూర్చారు. అంతేకాక ఇక్కడ లభ్యమయ్యే ఈ?బుక్స్‌ విద్యార్థులు తమ మొబైల్‌ లేదా వ్యక్తిగత కంప్యూటర్‌ ద్వారా ఎక్కడి నుంచైనా ఓపెన్‌ చేసుకుని చదువుకునే వెసులుబాటును కల్పించారు. విద్యార్థి ఐడీ నంబర్‌తో పాటు లైబ్రేరియన్‌ ఇచ్చే పాస్‌వర్డ్‌తో ఈ?బుక్స్‌ ఓపెన్‌ అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచారు. అలాగే లైబ్రరీలో ఉచిత వైఫై అందుబాటులో ఉండటం విద్యార్థులకు మేలు చేకూరుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సెమినార్‌లకు కృష్ణా యూనివర్సిటీ వేదికగా నిలుస్తుండటంతో పరిశోధన విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. వీరికి సౌకర్యవంతంగా ఉండేలా సెంట్రల్‌ లైబ్రరీలో 20 వేలుకు పైగా ఈ?జర్నల్స్‌ అందుబాటులో ఉంచారు. స్కాలర్స్‌తో పాటు బోధన చేసే అధ్యాపకులు కూడా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *