కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుంది

నిజామాబాద్‌
ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ధర్మపురి అరవింద్‌ మండిపడ్డారు. కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుంది. మా ఇంటిపై విూ గూండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తురాలేదా. ఆ రోజు మా అమ్మ ఒక్కతే ఇంట్లో ఉన్న సంగతి తెలిసే గూండాలను, బ్రోకర్‌ లను దాడికి పంపించావు. కరోనా తో తెలంగాణ ప్రజలు లక్షలు ఖర్చు చేసినప్పుడు ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ ఎందుకు అమలు చేయడంలేదు. అప్పుడు ప్రజలకు ఒక్కరూపాయి అయినా సాయం చేశారా. నిన్ను కుక్కా అన్నా జైలులో వేసినా ప్రజల నుంచి సింపతీ ఏమి రాదని అన్నారు. మనిషి బ్రతికున్నప్పుడు సాయం చేయరు కాని చనిపోతే 5 లక్షల రూపాయలు భీమా చేస్తారా అని ప్రశ్నించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *