ఎయిర్‌పోర్టు మెట్రోపై ముందడుగు,

హైదరాబాద్‌ మెట్రో సర్వీసులను శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వరకు పొడిగింపుపై ముందడుగు పడిరది. ఎయిర్‌ పోర్టు వరకు మెట్రోకు జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ గా సిస్ట్రా, రైట్స్‌ డీబీ ఇంజినీరింగ్‌ సంస్థల కన్సార్టియం ఎంపిక అయింది. జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ ఎంపిక పూర్తయిందంటూ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటన రిలీజ్‌ చేశారు. జనరల్‌ కన్సల్టెంట్‌ ఎంపిక కోసం మొత్తం 5 అంతర్జాతీయ కన్సార్టియంలు పోటీ పడ్డాయని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, పురపాలక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అర్వింద్‌ కుమార్‌, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డితో పాటు ఏర్పాటైన కమిటీ పోటీ పడ్డ 5 అంతర్జాతీయ కన్సార్టియంలను పరిశీలించినట్లు వెల్లడిరచారు. 5 కన్సార్టియాల సాంకేతిక సామర్థ్యాన్ని, వారి అనుభవాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని ఎయిర్‌ పోర్టు మెట్రోకు కన్సార్టియాన్ని ఎంపిక చేసినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సిస్ట్రా నేతృత్వంలోని కన్సార్టియానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చి టెండర్‌ అప్పగించినట్లు వెల్లడిరచారు. సిస్ట్రా నేతృత్వంలోని కన్సార్టియానికి సాంకేతికంగా అత్యధిక మార్కులు వచ్చాయని, అలాగే ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు ఈ కన్సార్టియం తక్కువ మొత్తంలో రూ. 98.54 కోట్ల మేర కోట్‌ చేసినట్లు మెట్రో రైల్‌ ఎండీ పేర్కొన్నారు. కన్సార్టియంలోని 3 సంస్థలకు ప్రజా రవాణా రంగంలో అందులోనూ మెట్రో రైళ్ల నిర్వహణలో విశేష అనుభవం ఉందని, ఆయా విభాగాల్లో ఈ సంస్థలు ప్రఖ్యాతి చెందినవి వెల్లడిరచారు. ఫ్రాన్స్‌ కు చెందిన సిస్ట్రా, భారతీయ రైల్వేలకు చెందిన రైట్స్‌, జర్మనీకి చెందిన డీబీ సంస్థలకు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు మెట్రో నిర్మాణంలో పలు విభాగాల్లో 18 మంది ఇంజినీరింగ్‌ నిపుణులు, క్షేత్రస్థాయిలో మరో 70 మంది సీనియర్‌ ఇంజినీర్లు, ఇతర సిబ్బందిని కన్సార్టియం సమకూర్చుతుంది. ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ వెంటనే తన పనిని మొదలు పెడుతుందని, ఎయిర్‌ పోర్టు మెట్రో నిర్మాణానికి అవసరం అయిన ఈపీసీ టెండర్‌ డాక్యుమెంట్లను త్వరలోనే తయారు చేస్తుందని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడిరచారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వరకు నిర్మించే రెండో ఫేజ్‌ లో మెట్రో లైన్‌? వెళ్లే రాయదుర్గం స్టేషన్‌? నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ వ?రకు ఉన్న పనులు ఇంజినీరింగ్‌ ?పరంగా అతి క్లిష్టమైనవి. ఈ ప్రాంతంలో మెట్రో సాంకేతిక సవాళ్లను ఎదుర్కొక తప్పదు. 21 విూటర్ల ఎత్తులో రాయదుర్గ్‌, మైండ్‌? స్పేస్‌? జంక్షన్‌ ను దాటడం ఒక పెద్ద సవాల్‌?తో కూడుకున్న విషయం. బెస్ట్‌ ఇంజినీరింగ్‌ సొల్యూషన్‌ కోసం రెండో ఫేజ్‌ మెట్రో లైన్‌ రూట్‌ మ్యాప్‌ పరిశీలించగా.. అంత ఎత్తులో మైండ్‌? స్పేస్‌? జంక్షన్‌ ను దాటడం ఒక పెద్ద సవాల్‌ అని అధికారులు గుర్తించారు. ఈ జంక్షన్‌ వద్ద కింద నుంచి అండర్‌ ?పాస్‌? వే ఉండగా, మధ్యలో రోటరీ, ఆ పైన ఫ్లై ఓవర్‌? ఇలా ఒకదాని విూద ఒకటి ఉన్నాయి. ఈ సవాల్‌ ను అధిగమించేందుకు పరిష్కారంగా ప్రత్యేకమైన స్పాన్‌ ?ని అక్కడే నిర్మించేలా పరిశీలించినట్లు చెప్పారు. ఇక్కడి నుంచి మొదలయ్యే మెట్రో లైన్‌ ?వెళ్లే ఎయిర్‌ ?పోర్టు మెట్రో పిల్లర్‌?లను ఫ్లైఓవర్‌? పిల్లర్‌?లకు దూరంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని గతంలో ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *