లబ్ధిదారులకు దళిత బంధు చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లొంకకేసారం గ్రామంలో దళిత కెసిఆర్ బాంధవుడు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా దళిత బంధు పథకం మంజూరైన వారికి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు లొంక కేసారం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులక సర్పంచ్ ఎండి. మంజూర్ చేతుల విూదుగా దళిత బంధు చెక్కులు ఇవ్వడం జరిగింది. కాగా ఇందులో సదానందం బూడిద మల్లేష్ బొంకురి మోహన్ కల్వల శ్రీనివాస్ లకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మంజూరి కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఒజ్జ ఓదెలు, మరియు వార్డు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండి.ఆరిఫ్, యువజన అధ్యక్షుడు నామని మహేష్, ఎగ్గెం సది, రంగు రాజబాబు,బండి చంద్రయ్య, ఈర్ల సతీష్,బూర్ల రాజయ్య,రాము తదితరులు పాల్గొన్నారు