కాక రేపుతున్న షర్మిళ

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జూఖీుఖ అధినేత్రి షర్మిల దూకుడు పెంచారు. కేసీఆర్‌ కు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఇప్పటికే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, టీ బీజేపీ బండి సంజయ్‌ లకు ఫోన్‌ చేసిన షర్మిల కలిసి పోరాడుదామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక తాజాగా రాష్ట్రంలోని ప్రతిపక్ష, విపక్ష పార్టీల అధ్యక్షులకు షర్మిల లేఖ రాశారు. జెండా వేరైనా..ఎజెండా ఒకటిగా రాజకీయాలను పక్కనబెట్టి యువత కోసం పోరాడాల్సిన అవసరం ఉందని షర్మిల ఈ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. దీనిపై ఏప్రిల్‌ 10న సమావేశమై ఉమ్మడి కార్యాచరణ రూపొందిద్దామని పేర్కొన్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడేందుకు..టీ సేవ్‌ (స్టూడెంట్‌ యాక్షన్‌ ఫర్‌ వెకెన్సీస్‌ ఎంప్లాయ్‌ మెంట్‌ అనే ఫోరాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ విభేదాలు పక్కకు బెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని..నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారని షర్మిల అన్నారు. కదుపుకాలి, గుండెలు మండి, తీవ్ర నిరాశలో, నిస్పృహలో నియంత, మోసపూరిత ప్రభుత్వం చేసిన మోసానికి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 9 ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కేసీఆర్‌ ఆడిన నాటకాలు విూకు తెలియనివి కావు. బిస్వాల్‌ కమిటీ సిఫార్సు చేసిన 1.9 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా..కేసీఆర్‌ నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు. ఇక ప్రశ్నపత్రాల లీకేజీతో ఉన్న ఆశలు కూడా అడుగంటిపోయాయని అన్నారు.ఇన్నాళ్లు పరస్పరం విమర్శలు గుప్పించుకున్న విపక్ష పార్టీలు సడెన్‌గా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటం చేద్దామనే నిర్ణయానికి రావడం హాట్‌ అవుతోంది. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పని చేద్దామంటూ తాజాగా షర్మిల బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిలకు ఫోన్‌ చేయడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.ఉమ్మడిగా పోరాటం చేసేందుకు షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్‌ త్వరలో సమావేశం అవుదామని చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు రేవంత్‌ రెడ్డి సైతం పార్టీలో చర్చించాక అభిప్రాయం చెబుతామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో ఉమ్మడి పోరాటం చేసేందుకు షర్మిల చేస్తు?న్న ప్రయత్నంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.షర్మిల ప్రయత్నం సక్సెస్‌ అయి బీజేపీ, కాంగ్రెస్‌, వైస్సార్‌ టీపీ ఏకం అయితే గనుగ వీరు చేసే పోరాటాలను ముందుండి నడిపించేది ఎవరూ అనేది ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ను ఎదురించేంది మేమంటే మేమే అని బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీగా ప్రకటనలు చేసుకుంటున్నాయి. మరో వైపు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో బీఎస్పీ, కోదండరామ్‌ పార్టీలు సైతం ప్రభుత్వంపై ఐక్యంగా పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇటీవలే కోదండరామ్‌, ఆర్‌ఎస్పీ భేటీ అయి ప్రభుత్వ వ్యతిరేక ప్రజా పోరాటాలు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. షర్మిల ఏకంగా బీజేపీ, కాంగ్రెస్‌ స్టేట్‌ చీఫ్‌ లకు ఫోన్‌ చేసి కలిసి నడుద్దామనే ప్రతిపాదన తీసుకురావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. బీజేపీతో పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ షర్మిల పిలుపుతో కలిసి నడుస్తుందా అనేది అనుమానమే. అయినా నిరుద్యోగుల సమస్యపై కలిసి పోరాటం చేద్దామని ముందుకు వస్తే ఈ పోరాటానికి ఎవరు సారథ్యం వహిస్తారనేది అసలు సమస్యగా మారే అవకాశం ఉంది. ముందుగా చొరవ తీసుకున్న కారణంగా షర్మిల వెనుక బీజేపీ, కాంగ్రెస్‌లు నడుస్తాయా లేక విూ వెంట నడవడం వీలు కాదంటూ ఆదిలోనే వెనక్కి తగ్గుతారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం విషయంలో షర్మిలతో కలిసి నడిస్తే తమ పార్టీలకు లాభమా నష్టమా అనేది కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటంలో బీజేపీతో కలిసి పని చేయాల్సి రావడమే కాంగ్రెస్‌కు ప్రధాన అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తు?న్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ తమ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఇబ్బందులకు గురి చేస్తోందనేది కాంగ్రెస్‌ వాదన. ఈ అంశంలో బీజేపీ కార్నర్‌ చేసేందుకు జాతీయ స్థాయిలో కార్యచరణ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీతో కలిసి పోరాటం చేస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళుతాయనేది కూడా ఆ పార్టీ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *