అదిలాబాద్ లో కాయ్ రాజా కాయ్
అదిలాబాద్, అక్టోబరు 16
తెలంగాణలో మోగిన ఎన్నికల నగరాలో.. ఏ నేతకు టికెట్ వస్తుంది.. ఏ నేత బరిలో నిలుస్తారు.. ఫస్ట్ లిస్ట్ లో ఏ నేత పేరు ఖరారవుతుందంటూ సాగుతోంది. తెలంగాణ రాజకీయ పండుగలో పొలిటికల్ బెట్టింగ్లంట.అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థునులు ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఇంకా టికెట్లు ఖరారు చేయకపోవడంతో ఆశవాహుల ఆశలను అభిమానాలు టెన్షన్ను తమకు అనుకూలంగా మార్చుకుని.. టికెట్ల పైనే పందెం సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖాయం మంటూ జోరుగా బెట్టింగ్ లు సాగుతుంటే.. బీజేపీలో పాయల్ శంకర్ కే టికెట్ అంటూ పందెం కొనసాగుతుందట. టికెట్ పై ఆశలు సన్నగిల్లిన నేతలపై సైతం పది రెట్ల డబుల్ రిటర్న్స్ ఇస్తామంటూ.. బెట్టింగ్ రాయుళ్లు మాయమాటలతో బురిడి కొట్టిస్తుండటంతో మరికొందరు ఆశవాహులపై సైతం కాయ్ రాజా కాయ్ ఆట జోరుగానే సాగుతుందంట. అటు ఆసిపాబాద్ లో కాంగ్రెస్ నేత శ్యాంనాయక్ , రాథోడ్ గణేష్ లపై , బోథ్ లో రాథోడ్ బాపురావు , సోయం బాపురావు ఖానాపూర్ లో రేఖానాయక్ , వెడ్మ బొజ్జలపై కాయ్ రాజా కాయ్ పందెం జోరుగా సాగుతుందంట.అదిలాబాద్ జిల్లాలో బెట్టింగ్ జోరు అంతకు మించి అన్న రేంజ్లో సాగుతుందట. అయితే ఈ బెట్టింగ్ మాత్రం ఏ టీం వరల్డ్ కప్ గెలుస్తుంది.. ఏ టీం ఫైనల్ బెర్త్ కన్పాం చేసుకుంటుంది.. ఏ ఆటగాడు ఎక్కువ పరుగులు చేస్తాడని కాదట. మరో వైపు మొదటి విడతలోనే టికెట్ దక్కించుకునే నేతలెవరు అన్న విషయంలోను బెట్టింగ్ సాగుతున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ లో మొదటి విడత రిలీజ్ అవడం ఇందులో ఆదిలాబాద్ , బోథ్ , ఖానాపూర్ , ఆసిపాబాద్ నేతల పేర్లు లేకపోవడంతో రెండో విడతలో అయినా దక్కుతుందా లేదా అన్న బెట్టింగ్ కూడా మొదలెట్టిసినట్టు సమాచారం. అటు బోథ్ లో ఎంపీ సోయం బాపు రావుపై ఏకంగా పక్క పార్టీ నుండి టికెట్ దక్కించుకుంటారంటూ.. హస్తం పార్టీ నుండి బరిలోకి దిగుతారంటూ బెట్టింగ్ లు సాగుతున్నాయంట. ఈ బెట్టింగ్ లు సాగుతున్న నియోజక వర్గాలన్ని ఏజేన్సీ నియోజక వర్గాలు కావడంతో ఇలాంటి తరహా పందాలు గతంలో ఎప్పుడు మా ప్రాంతాల్లో చూడలేదన్న టాక్ నడుస్తుంది.ఇక ఈ విష సంస్కృతి మరింత పెరిగితే ఎన్నికలు ముగిసేనాటికి పందెం రాయుళ్ల ఇళ్లు గుల్లవడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ పందెలాను ఎవరు నిర్వహిస్తున్నారు.. ఎక్కడి నుండి ఈ బెట్టింగ్ మాపియా మానిటర్ అవుతుందన్నది తేలాల్సి ఉ