గోరంట్లపై వైసీపీ ఆచితూచి అడుగులు..
ఏదో సినిమాలో లవ్ చేయాలా వద్దా అని ఓ పాట ఉంది. హీరోయిన్ ను ప్రేమించాలా వద్దా అన్న సందిగ్ధంలో హీరో ఆ పాట పాడతాడు. కానీ ఇప్పుడు వైసీపీ కూడా ఒక సందిగ్ధంలో ఉంది. అది సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవాలా వద్దా అన్నదే ఇప్పుడు వైసీపీ సందిగ్ధత. మహిళలో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిన ఎంపీ మాధవ్ ను క్షణం ఆలస్యం చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, చర్య తీసుకోవాలా, తీసుకుంటే ఏ చర్య తీసుకోవాలి అంటూ గురువారం సాయంత్రం నుంచి వైసీపీ అధినేత జగన్ మల్ల గుల్లాలు పడుతున్నారు.పార్టీ సీనియర్లతో మాధవ్ పై చర్య తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలాంటి చర్య తీసుకోవాలి అని ఎడతెగకుండా చర్చిస్తున్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయిన గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకునే విషయంలో ఇంతగా తర్జన భర్జన పడుతున్న వైసీపీ అధినేత జగన్.. తనపైనా, తన సర్కార్ పైనా సామాజిక మాధ్యమంలో విమర్శిస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయించే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తొలుత సీఎంవో నుంచి గోరంట్ల మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు లీకులు ఇచ్చారు.మళ్లీ కొద్ది సేపటికే ఆయన చేత రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అది కూడా ఖరారు కాలేదు. అసలు చర్య తీసుకోవాలా వద్దా అన్న విషయంపైనే జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోగా ప్రభుత్వ సలహాదారు సజ్జల విూడియా ముందుకు వచ్చి.. గోరంట్లపై చర్య తీసుకోవాలా వద్దా అన్ని నిర్ణయానికి ఇంకా రాలేదనీ, ఆయన ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఖండిరచారనీ, మార్ఫింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారనీ చెప్పారు. ఒక వేళ ఆ వీడియో మార్ఫింగ్ కాలేదని తేలితే మాధవ్ పై కఠిన చర్యలు తప్పవని విూ?యా ముందు సజ్జల చెప్పారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని తొలుత నేతలు లీకులిచ్చారు. అయితే మాధవ్తోనే రాజీనామా చేయించాలని కొందరు నేతలు సూచించారనీ, దాంతో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళ తో గోరంట్ల న్యూడ్ గా వీడియో కాల్ లో మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమం ద్వారా వెలుగులోనికి రావడంతో ఆయన పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లు కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలకు మహిళల పట్ల గౌరవం లేదనడానికి గతంలో అంబటి, అవంతి శ్రీనివాస్ లు, ఇప్పుడు గోరంట్ల మాధవ్ లే నిదర్శనమని సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి