కేసీఆర్కు భయపడే రోజులు పోయాయి.. బీజేపీ గెలుపును ఆపలేరు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etala) విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు భయపడే రోజులు పోయాయని ఎమ్మెల్యే ఈటల అన్నారు. పోలీసులతో ఏమీ చేయలేరు.. ఎంతమందిపై కేసులు పెడతారని ఈటల ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను పోలీసులతో కట్టడి చేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలను పట్టించుకోరని, కేసీఆర్ ఆలోచనంతా ఇతర పార్టీల నేతలను కొనేదానిపైనే ఉందని ఈటల మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్ అని పోలీసులు మర్చిపోవద్దని, బీజేపీ గెలుపును కేసీఆర్ ఆపలేరు, పోలీసులు ఆపలేరని ఈటల పేర్కొన్నారు.