కాళేశ్వరానికి కేంద్ర బృందం

కరీంనగర్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌? హౌస్‌లు మునగడంపై కేంద్రం పరిశీలన మొదలుపెట్టింది. సీడబ్ల్యూసీ బృందాన్ని కాళేశ్వరానికి పంపించింది. సీడబ్ల్యూసీ డైరెక్టర్‌?పీఎస్‌?కుటియాల్‌?నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం మేడిగడ్డ, అన్నారం పంప్‌?హౌస్‌లు, బ్యారేజీలను పరిశీలించింది. ఈ సందర్భంగా కీలక విషయాలపై ఆరా తీసింది. ప్రాజెక్టు పంప్‌ హౌస్‌లు మునగడంపై పలు ప్రశ్నలు సంధించారు. అనుమతులు తీసుకునే సమయంలో ఇచ్చిన డిజైన్లలో లోపాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేసినట్లు అధికారికవర్గాల సమాచారం.అన్నారం పంప్‌?హౌస్‌?మునగడం పై నిర్మాణ లోపాలే కారణమని సీడబ్ల్యూసీ బృందం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 107 అడుగుల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించినట్లుగా ప్రభుత్వం డీపీఆర్‌ లో సూచించినట్లు ఇంజినీర్లు చెప్తుండగా.. 105 అడుగుల్లోనే వరద వచ్చిందని, దీనితో ఎందుకు మునిగిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవేళ 107 అడుగులకు మించి వరద వస్తే.. బ్యారేజీ ల నుంచి ఓవర్‌?ఫ్లో కాలేదనే ప్రశ్నలు వేసినట్లు తెలిసింది.మరోవైపు 24 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంలో మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు నిర్మించగా.. ఇక్కడ గరిష్టంగా 21 లక్షల క్యూసెక్కలు వరద దాటలేదని, దీని ప్రకారం ఎలా మునిగిందని సీడబ్ల్యూసీ ఇంజినీర్ల బృందం అనుమానిస్తోంది. దీనితో పాటుగా హెడ్‌?రెగ్యులేటర్‌? ప్రాంతాలను పరిశీలించారు. హెడ్‌?రెగ్యులేటర్‌?లాక్‌?ఓపెన్‌?కాకుండా నీరెలా వచ్చాయనే దానిపై వివరాలు అడిగారు. దానిపై పరిశీలన చేస్తున్నామని కాళేశ్వరం ఇంజినీర్లు సమాధానమిచ్చారు. అదే సుందిళ్ల దగ్గర ఎందుకు ముంపు లేదనే విషయాలపై ఇంజినీర్ల బృందం వివరాలు సేకరించింది. అటు దేవాదుల ప్రాజెక్టు పరిస్థితిని కూడా సీడబ్ల్యూసీ బృందం అంచనా వేసింది.కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి వరదలతో మునగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరకగా మారింది. మేడిగడ్డ, అన్నారం పంప్‌?హౌస్‌ల్లోకి నీరు వెళ్లడం, మోటర్లు మునిగిపోవడంపై దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు, ఇరిగేషన్‌?నిపుణులు రీ డిజైన్‌ను తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం కూడా పరిశీలనకు దిగడం కొంత మేరకు ఆసక్తిగా మారింది. అయితే, దీనికి సంబంధించిన 10 రకాల అనుమతులు బీజేపీ ప్రభుత్వమే ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉంది. కానీ, అనుమతుల కోసం ఇచ్చిన డిజైన్‌ల మేరకు కాకుండా.. కొన్ని మార్పులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీడబ్ల్యూసీ బృందం.. కేంద్రానికి ఇచ్చే నివేదికపై ఉత్కంఠ నెలకొంది.కాళేశ్వరం థర్డ్‌?టీఎంసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం.. సీడబ్ల్యూసీ అనుమతి కోసం నివేదించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి వచ్చిన సీడబ్ల్యూసీ డైరెక్టర్‌?పీఎస్‌? కుటియాల్‌?బృందం.. థర్డ్‌ టీఎంసీ పనులను సైతం పరిశీలించింది. ఇక్కడ సివిల్‌? వర్క్స్‌, కాలువ సామర్థ్యం, మూడో టీఎంసీ తరలింపునకు ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే వివరాలను ఇంజనీర్ల దగ్గర నుంచి సేకరించింది. సీడబ్ల్యూసీ బృందంతో పాటుగా జీఆర్‌?ఎంబీ ఇంజనీర్లు కూడా ఈ పరిశీలన పర్యటనలో ఉన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *