కడప టూ తిరుమల… ఎలక్ట్రిక్‌ బస్సులు

ఏపీఎస్‌ఆర్టీసీ కొత్తగా 12 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కడప నుంచి తిరుమల మార్గంలో నడపబోతున్నట్లు అధికారులు వెల్లడిరచారు. సోమవారం రోజు కడప డిపోలో ఈ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 12 బస్సులను గాను 6 బస్సులు నాన్‌ స్టాప్‌ గా నడవబోతున్నాయి. మరో ఆరు బస్సులు అవసరాన్ని బట్టి తిరుగుతాయి. తెల్లవారు జాము 4.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కడప నుంచి తిరుమలకు వెళ్లే పెద్దలకు అయితే రూ.340, పిల్లకు అయితే రూ.260 చొప్పున ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ సందర్భంగానే ఛైర్మన్‌ మల్లికార్జున్‌ రెడ్డి మాట్లాడుతూ… అన్ని డిపోల్లో దశల వారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.ఇప్పటికే తిరుమల ` తిరుపతి మధ్య 50 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. రేణిగుంట ఎయిర్‌ పోర్టు ` తిరుమల మధ్య 14, తిరుపతి ` మదనపల్లె మధ్య 12, తిరుపతి ` నెల్లూరు మధ్య 12 బస్సులు నడపనున్నట్లు మల్లికార్జున్‌ రెడ్డి వివరించారు. నోట్ల రద్దు, కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ వాడకం పెరిగింది. క్యాష్‌ లెస్‌ పేమెంట్స్‌ వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆన్‌ లైన్‌ పేమెంట్స్‌ అమల్లోకి రావడంతో ఆ దిశగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బస్సు ప్రయాణాల్లో నగదు, చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యూనిఫైడ్‌ టిక్కెటింగ్‌ సొల్యూషన్‌ పేరిట డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో పాటు పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యూపీఐ పేమెంట్స్‌ ద్వారా బస్సు టికెట్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని మొదటిగా విశాఖ జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. విశాఖ నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, గరుడ, అమరావతి సర్వీసుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. త్వరలోనే విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సుల్లో యూపీఐ పేమెంట్స్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడిరచారు. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ఇచ్చేందుకు ప్రత్యేక రూపొందించిన టిమ్స్‌ పరికరాలు ఉపయోగిస్తున్నారు. త్వరలో వీటి స్థానంలో ఈ`పోస్‌ యంత్రాలను అందిస్తామని అధికారులు అంటున్నారు. విశాఖపట్నం జిల్లాకు 180 ఈ`పోస్‌ మిషన్లు అందించారు. వీటి వినియోగంపై ఇప్పటికే డ్రైవర్లు, కండక్టర్లకు తగిన శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతానికి బస్సుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారు 10 శాతంగా ఉండగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *