గుంటూరు వైసీపీలో సద్దుమణిగిన వివాదం

గుంటూరులో మేయర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యేగా అన్నట్లుగా సాగుతున్న రాజకీయాలకు హైకమాండ్‌ తెరదించిది. ఇద్దరు నేతలు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని విూడియా ముందు చెప్పాలని ఆదేశించడంతో అదే పని చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ నాయకులు మా పై అభాండాలు వేస్తున్నారని.. మా మధ్య గొడవలు లేవన్నారు. మాకు పార్టీ ముఖ్యం…వ్యక్తిగత ప్రయోజనాలు కోసం పార్టీని వాడుకోం …పార్టీ సింబల్‌ ఫ్యాన్‌ రెక్కల క్రిందే మేము ఉంటాం అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్‌ మనోహర్‌ నాయుడు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్‌ మనోహర్‌ కు , గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్థఫాకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మేయర్‌ తమకు సరైన ప్రాధాన్యతనివ్వటం లేదని పదమూడు మంది కార్పొరేటర్లు మునిసిపల్‌ ట్రావెలర్‌ బంగ్లాలో సమావేశమయ్యారు. గత కొంతకాలంగా సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లే అసంత్రప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మేయర్‌ పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన కావటి మనోహర్‌ నాయుడికి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. అయితే గుంటూరు తూర్పు పరిధిలోకి వచ్చే కార్పోరేటర్‌ రమేష్‌ గాంధీకి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే ముస్తఫా పట్టుపట్టారు. కానీ మనోహర్‌ నాయుడికే పదవి దక్కింది. అప్పటి నుండి ఇరువురికీ పొసగడం లేదు. మేయర్‌ పదవి నుంచి మనోహర్‌ నాయుడును తొలగించేందుకు ఎంఎల్‌ఏ ముస్తఫా ప్రయత్నం చేస్తున్నాడరని అని కావటి వర్గం భావిస్తోంది. ఎంఎల్‌ఏ ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలతో పనులు కొనసాగిస్తూ ముస్తఫాను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఎంఎల్‌ఏ వర్గం అనుమానిస్తోంది. ఈ క్రమం? కార్పొరేటర్లు సమావేశం పెట్టుకోవడం వైసీపీలో సంచలనం రేపింది. సొంత పార్టీలో కార్పోరేటర్ల కుమ్ములాట..మేయర్‌ వర్సెస్‌ ఎంఎల్‌ఏ అంటూ సోషల్‌ విూడియాలో కథనాలు హోరెత్తించాయి. ఈ వార్తలపై ఎవ్వరూ స్పందించక పోవడంతో కథనాలకు మరింత బలం చేకూరింది. పార్టీ పరువు బజారున పడటంతో నష్ట నివారణ చర్యలను హైకమాండ్‌ చేపట్టింది. మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిని, ఎంఎల్‌ఏ ముస్తఫాను గుంటూరు రీజనల్‌ కార్యలయానికి పిలిపించారు ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి. నాలుగు గంటల పాటు ఇద్దరితో మాట్లాడారు. వారు చెప్పిన విషయాలు ?పికతో విన్న అయోధ్య రామిరెడ్డి పార్టీ పరువు బజారులో పెట్టే పరిస్థితి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఒక పక్కన ప్రతిపక్ష పార్టీల పొత్తులు, ఎత్తులు, జిత్తులతో తలమునకలై ఉన్నామని అలాంటి సందర్భంలో సొంత పార్టీలో ఈ గొడవలేమిటని ప్రశ్నించారు. ఎంపీ క్లాస్‌ పీకడంతో జరుగుతున్న వివాదలకు ముగింపు పలికేందుకు మేయర్‌, ఎంఎల్‌ఏ సిద్దమయ్యారు…గుంటూరు గాంధీ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ పనుల పరిశీలన వేదికగా చేసు కున్నారు..పార్కులోపనులను కావటి, ముస్తఫా కార్పోరేటర్లతో కలసి పరిశీలించారు. తర్వాత మధ్య విబేధాలేవిూ లేవని ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *