ఏంటిది జై షా.. మరీ ఇంత చీప్‌గా.. ఫ్యామిలీతో కలిసి మ్యాచ్ చూస్తుంటే ఇదేంటని నెటిజన్స్ ఫైర్..!

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రధాన కార్యదర్శి జే షా (Jay Shah) ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (GTvsCSK) జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ (IPL Final Match) జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు తన సన్నిహితులతో కలిసి జే షా హాజరయ్యారు. స్టేడియంలో కూర్చున్న జే షా అసభ్యకరంగా సైగలు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది

ఆయన ఏ ఉద్దేశంతో అలా చేశారో, ఎవరైనా అలా ఎడిట్ చేశారో తెలియదు కానీ, ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కెమెరా ఎదురుగానే జే షా అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆయన ప్రవర్తన హేయం. మేం మా ఫ్యామిలీతో కలిసి మ్యాచ్ చూస్తున్నాం“ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కాగా, ఈ మ్యాచ్ నిర్వహణ తీరుపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. కేవలం కొద్ది నిమిషాలు వర్షం (Rain) పడినందుకు పిచ్ చిత్తడిగా మారిపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *