దిశా` దిశ …ఎక్కడ…

విజయవాడ, అక్టోబరు 10
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత రాష్ట్రంలో పోరాటం చేయకుండా, గల్లీ వదిలి ఢల్లీి లో నారా లోకేశ్‌ హడావుడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆమోదించలేకపోతున్నారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న పార్టీ అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికే టీడీపీ నాయకులు చంద్రబాబు అరెస్టు తర్వాత దిశా `దశా లేకుండా అనాలోచితంగా వ్యవహరిస్తూ ప్రజల్లో చులకనై పోతున్నారు.చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న వాదన ప్రజల్లోకి వెళ్లడంతో ఆయనకు సానుభూతి కూడా వచ్చింది. కానీ, ఈ సానుభూతిని తమకు అనుకూలంగా మల్చుకోవడంలో టీడీపీ విఫలమైంది. ఎప్పుడయినా ఒక రాజకీయ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడే నాయకుడికి తనను తాను నిరూపించుకునే అవకాశం కలుగుతుంది. 1984లో నాదేండ్ల భాస్కర్‌ రావు ఎపిసోడ్‌ సమయంలో, తన వ్యూహ రచనలతో టీడీపీని సంక్షోభం నుంచి బయటపడేసిన చంద్రబాబు ఎన్టీఆర్‌కి దగ్గరయ్యారు. ప్రతి విషయానికి తన విూదే ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడి నుంచి చంద్రబాబు ఒక కొత్త శక్తిగా, తిరుగులేని నాయకుడిగా అవతరించారు. చంద్రబాబు అరెస్టుతో నాయకుడుగా తనను తాను నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని లోకేశ్‌ చేజేతులా వదులుకున్నారు.మే 27, 2012 న వైఎస్‌ జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడకుండా, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల పార్టీ బాధ్యతల్ని తమ భుజాలపైకి ఎత్తుకుని పార్టీకి కొత్తశక్తిని ఇవ్వడంతోపాటు దానికి దిశా దశా నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 రోజుల పాటు విస్తృతంగా ఊరూ`వాడా తిరిగి ఉపఎన్నికల్లో 18 నియోజకవర్గాలకు 15 స్థానాలను ఒంటిచేత్తో గెలిపించారు. దాంతో పార్టీ నిలబడిరది. ఆ తర్వాత కూడా దాదాపు 15 నెలల పాటు జగన్‌ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయినా మొక్కవోని ధైర్యంతో పోరాడుతూ వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిలా ఢల్లీి కి వెళ్లి లాయర్ల చుట్టూ తిరగకుండా ధైర్యంగా గల్లీలో పోరాటం చేశారు.వైఎస్‌ షర్మిలా ఏ మహిళా చేయనంతగా, సాహసంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కిలోవిూటర్ల పాదయాత్ర చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్‌ విజయమ్మ దీక్షలు, రాస్తారోకోలు చేస్తూనే, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించడంతోపాటు, సమైక్య రాష్ట్రం కోసం కూడా ఆమరణ నిరాహారదీక్ష వంటి కార్యక్రమాలను చేపట్టి వైఎస్‌ఆర్‌సీపీని బ్రతికించారు.ప్రస్తుతం ఇప్పుడు అచ్చం ఇలాంటి సంక్షోభ పరిస్థితినే ఎదుర్కొంటున్న టీడీపీలో మాత్రం ఆ పోరాట పటిమ, సమయస్ఫూర్తి కానరావడం లేదు. దీనికి తోడు దిశా`దశా లేకుండా పార్టీ వ్యవహరిస్తోంది.చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేశ్‌ ఢల్లీి కి వెళ్లారు. ఒక రోజు, రెండు రోజులనుకుంటే సరే, రోజుల తరబడి ఆయన ఢల్లీి చుట్టూ తిరగడం సమర్థనీయం కాదు. న్యాయవాదులతో సంప్రదింపుల పేరిట ఢల్లీిలో రోజుల తరబడి మకాం వేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అరెస్టు న్యాయపరిధిలో ఉంది, కాబట్టి దాన్ని లీగల్‌ టీమ్‌కి అప్పగించి లోకేశ్‌ ప్రజాక్షేత్రంలోకి వెళ్లుంటే పరిస్థితులు మరోలా ఉండేవి. నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి వచ్చిన ఈ సదవకాశాన్ని ఆయనే జారవిడుచుకున్నారు.యువగళం మధ్యలో ఆపేయడం లోకేశ్‌ చేస్తున్న అతిపెద్ద తప్పు. పాదయాత్ర చేస్తే, మధ్యలో ఆపి అరెస్టు చేస్తే, మహా అయితే, జైలుకు వెళ్తారు. కానీ, యువగళం ద్వారా ప్రజా నాయకుడిగా ఎదిగేందుకు వచ్చిన సువర్ణవకాశాన్ని లోకేశ్‌ జారవిడుచుకుంటున్నారు. 16 నెలలు జైలులో ఉండి వచ్చిన వారం రోజుల్లోపే జగన్‌ లోటస్‌ పాండ్‌ వద్ద సమైక్యాంధ్ర కోసం దీక్ష చేశారు.
జైలు నుంచి వచ్చేనాటికి ఎన్నికలకు ఆరు నెలలే ఉండటంతో, ఆ ఆరు నెలలూ ఊరూవాడా తిరిగారు. 67 సీట్లతో గెలుపుకు దగ్గరగా వచ్చి, ప్రతిపక్షనేత అయ్యారు. ఆ తర్వాత ప్రతి శుక్రవారం కోర్టులో విచారణకు హాజరవుతూనే సంవత్సరం పాటు నిరంతరాయంగా 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. జైలుకు భయపడితే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేవారా? ఎన్నికలకు ఇంకా 180 రోజుల సమయం మిగిలి ఉన్న ఈ తరుణంలో ఇలాంటి సంకల్పం లోకేశ్‌లో లేదని కొట్టొచ్చినట్టు కనపడుతోంది.వైఎస్‌.రాజశేఖరరెడ్డి అకాల మరణం తట్టుకోలేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుమారుడిగా వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర పేరిట నెలల తరబడి చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కొంత సహాయం అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారనే బాధ తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు విడిచినట్లు విూడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నాయకులు సోషల్‌ విూడియాలో పోస్టులు పెడుతున్నా, ఆ కుటుంబాల దగ్గరకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం టీడీపీ నాయకులు కానీ, నారా లోకేశ్‌, నారాబ్రాహ్మణి, నారా భువనేశ్వరి ఏ ఒక్కరూ చేయడం లేదు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో తన కుమారుడు సంజయ్‌ గాంధీ చనిపోయినప్పుడు, ఇందిరాగాంధీ ముందుగా ఆ ప్రమాదంలో చనిపోయిన కో పైలట్‌ కుటుంబాన్ని పరామర్శించారు. నాయకుడు అంటే అలా ధైర్యం ఇవ్వాలి.చంద్రబాబు 73 ఏళ్ల వయసులో కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకున్న మనోధైర్యము, సంకల్పము, పట్టుదల, సమయస్ఫూర్తి, ప్రస్తుత టీడీపీ నాయకగళంలో ఇసుమంతా కూడా ఏ ఒక్కరిలో లేదు. లోకేశ్‌ ఈ దిశగా ఆలోచించాల్సిన అసవరం ఉంది.వైఎస్‌ విజయమ్మలాగా, నారా భువనేశ్వరి, వైఎస్‌ షర్మిలా వలే నారా బ్రహ్మణి పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని అందరూ ఊహించినా… ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదనే అసంతృప్తి ప్రజల్లో, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నెలకొంది. రాజమండ్రి సరిహద్దులు దాటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఒక్క కార్యక్రమం కూడా వారు నిర్వహించకపోవడం దీనికి నిదర్శనం.చంద్రబాబు అరెస్టును లీగల్‌ టీమ్‌కి వదిలేయాలి. ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే, ఇంకెప్పటికీ రాదు అన్నట్టుగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి, ఒక్కో నియోజకవర్గంలో వంద గ్రామాలు, సుమారు 250` 300 పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయి.
ఎన్నికలకు 180 రోజులే ఉన్న నేపథ్యంలో… ఇప్పటికైనా సోషల్‌విూడియా పోస్టులకు, విూడియాకు దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే టీడీపీకి భవిష్యత్‌ ఉంటుంది. లేనిపక్షంలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి.అధికార వైఎస్‌ఆర్‌సీపీ వ్యుహాత్మకంగా ప్రతిపక్షాన్ని పక్కదోవ పట్టించి, ‘గడపగడపకు ప్రభుత్వం’, ‘ఏపీకి జగనే ఎందుకు కావాలంటే’, ‘జగనైతేనే చేస్తాడు’ వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువ అవుతూ వారి మనస్సులను దోచుకుంటోంది. వాలెంటీర్లతో పోలింగ్‌ బూతుల వారీగా సమాచారం సేకరించి, వివిధ కులాలకు జరిగిన లబ్థిని జగన్‌ వాయిస్‌ మెసేజ్‌తో లబ్ధిదారులకు చేరవేస్తున్నారు. వైసీపీ ఇంత సూక్ష్మస్థాయి ప్రచారం చేస్తుంటే, ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఇంకా ఎన్నికలు నాలుగు సంవత్సరాలు ఉన్నాయన్నట్లుగా సోషల్‌ విూడియా పోస్టులకు, విూడియా పోస్టులకే పరిమితమవుతోంది.టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు విరమించుకున్నట్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా విరమించుకుంటుందా? అనే సందేహాలు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *