యూనిఫాం సివిల్‌ కోడ్‌ అడుగులు

న్యూఢల్లీి, జూలై 4
ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానుంది. ఈ మేరకు.. న్యాయవ్యవహారాల పార్లమెంట్‌ స్టాండిరగ్‌ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భేటీకి న్యాయమంత్రిత్వ శాఖతోపాటు లా కమిషన్‌ అధికారులు హాజరయ్యారు. ఇక.. దేశంలోని పౌరులు అందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దేశ ప్రజలందరికీ ఒకే పౌర చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో ఉంది. అందుకే.. ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి సంబంధించి వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని చూస్తోంది మోదీ సర్కార్‌. అయితే.. ఈ ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని కొన్ని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *